ఆంధ్రప్రదేశ్ వైసీపీ లో ఫైర్ బ్రాండ్ గా పేరు తెచ్చుకున్నారు మంత్రి రోజా. ఇటీవల రాష్ట్రంలో ప్రారంభించిన జగనన్న స్వర్ణోత్సవాల కార్యక్రమాల్లో ఆమె చురుకుగా పాల్గొంటున్నారు. పలు క్రీడా ప్రారంభోత్సవాల్లో పాల్గొంటు క్రికెట్, టెన్నీస్, వాలీబాల్ ఇలా ఒక్కటేమిటి అన్ని రకాల క్రీడల్లో పాల్గొంటూ తన టాలెంట్ చూపించారు. సోమవారం నగరి డిగ్రీ కాలేజ్ లో జగనన్న క్రీడా సంబరాలు ప్రారంభించారు మంత్రి రోజా. ఈ సందర్భంగా విద్యార్థులతో కబడ్డీ ఆడుతున్న సమయంలో అపశృతి చోటు చేసుకుంది. కబడ్డీ ఆడుతున్న సమయంలో విద్యార్ధులు ఆమెను ఔట్ చేసే క్రమంలో కిందపడిపోయారు.. వెంటనే సిబ్బంది అలర్ట్ అయి ఆమెను పైకి లేపారు.
ఏపీ క్రీడాశాఖా మంత్రి రోజా నగరి డిగ్రీ కాలేజ్ లో జగనన్న క్రీడా సంబరాలు ప్రారంభించారు. ఈ సందర్బంగా క్రికెట్, వాలీబాల్, కబడ్డీ ఆడి విద్యార్థుల్లో జోష్ పెంచారు. ఈ క్రీడాల్లో నగరి నియోజకవర్గంలో పలు గ్రామాల క్రీడాకారులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా విద్యార్థులతో మంత్రి రోజా కబడ్డీ ఆడేందుకు సిద్దమయ్యారు. ఈ క్రమంలో కూతకు వెళ్లిన మంత్రి రోజాను కొంతమంది అమ్మాయిలు టాకీల్ చేశారు.. దీంతో ఆమె ఒక్కసారే పట్టు తప్పి కిందపడిపోయారు.. వెంటనే అధికారులు.. కార్యకర్తలు ఉలిక్కిపడ్డారు. వెంటనే ఆమెను పైకి లేపారు.. అయితే తనకు ఏమీ కాలేదని, కంగారు పడాల్సిన అవసరం లేదని రోజా వాల్లందరికీ సర్ధిచెప్పారు.
ఈ సందర్భంగా రోజా మాట్లాడుతూ.. ఏపిలో సీఎం జగన్ అధికారంలోకి వచ్చిన తర్వాత విద్యా, క్రీడా రంగానికి ఎంతో ప్రోత్సాహం లభిస్తుంది.. గ్రామీణ స్థాయిలో ఎంతో మంది అద్భుతమైన క్రీడాకారులు ఉన్నారు.. అలాంటి మట్టిలో మాణిక్యాలను వెలుగులోకి తీసుకు రావడానికి ఇలాంటి క్రీడా పోటీలు చక్కగా ఉపయోగపడతాయి. యువతకు చదువుతో పాటు క్రీడలు కూడా ఎంతో అవసరం.. గ్రామ సచివాలయాల్లో ఏ ఏ క్రీడల్లో సామర్థ్యం చూపిస్తారో వారంతా తమ పేర్లు తప్పకుండా నమోదు చేయించుకోవాలి. జిల్లా స్థాయిలో విజయం సాధించిన వారికి జోనల్, రాష్ట్ర స్థాయిలో పోటీలు నిర్వహిస్తామని.. డిసెంబర్ 21న సీఎం జగన్ పుట్టిన రోజు సందర్భంగా విజేతలకు అవార్డులు అందజేస్తామని మంత్రి రోజా అన్నారు. ప్రస్తుతం మంత్రి రోజా కి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.