Adimulapu Suresh Collapsed With Health Problem: ఆంధ్రప్రదేశ్ పురపాలక, పట్టణాభివృద్ధి మంత్రి ఆదిమూలపు సురేశ్ కొన్ని రోజుల కిందట మంత్రి ఆదిమూలపు సురేశ్ అస్వస్థతకు గురవ్వడంతో ఆస్పత్రిలో చేర్పించి చికిత్స అందించిన సంగతి తెలిసిందే. డాక్టర్లు యాంజియోప్లాస్టీ నిర్వహించి స్టంట్ వేశారు. డిశ్చార్జ్ అయిన తర్వాత ఇంటికి వచ్చిన మంత్రి సురేశ్ విశ్రాంతి తీసుకున్నారు. ఇప్పుడు ఆయన మరోసారి అస్వస్థతకు గురవ్వడం కలకలం రేపుతోంది. శనివారం (జూన్ 25) ఉదయం మార్నింగ్ వాక్కు వెళ్లిన మంత్రి నడుస్తూ నడుస్తూ ఒక్కసారిగా కిందపడిపోయారు. ప్రకాశం జిల్లా మార్కాపురంలోని తన కాలేజీలో వాకింగ్ చేస్తుండగా ఈ ఘటన జరిగింది. కుటుంబసభ్యులు వెంటనే వైద్యులకు సమాచారం ఇవ్వడంతో.. వైద్యులు కాలేజీకి చేరుకొని మంత్రి సురేశ్కు వైద్య పరీక్షలు నిర్వహించారు. బీపీలో హెచ్చుతగ్గుల వల్లే ఆయన కిందపడినట్లు డాక్టర్లు తెలిపారు. కొన్ని గంటల పాటు కాలేజీలోనే మంత్రి సురేశ్ విశ్రాంతి తీసుకున్నారు.
గత నెల చివర్లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ శ్రీకాకుళం నుంచి అనంతపురం వరకు నిర్వహించిన బస్సు యాత్రలో ఆదిమూలపు సురేశ్ ఉత్సాహంగా పాల్గొన్నారు. ఇలా బస్సు యాత్రలో ఉండగానే ఆయన స్వల్ప అస్వస్థతకు గురయ్యారు. ఈ క్రమంలోనే ఆయనను హైదరాబాద్లోని యశోద ఆస్పత్రిలో మంత్రి సురేశ్ వైద్య పరీక్షలు చేయించుకున్నారు. గుండె రక్తనాళంలో లోపం ఉన్నట్టు గుర్తించిన డాక్టర్లు ఆయనకు స్టెంట్ వేశారు. జూన్ 11న ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ అయిన మంత్రి సురేశ్.. వైద్యుల సూచన మేరకు ఆయన కొద్ది రోజులు తన స్వస్థలంలోనే విశ్రాంతి తీసుకున్నారు. తాజాగా మరోసారి అస్వస్థతకు గురవ్వడం ఆందోళన కలిగిస్తోంది. మరి దీనిపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.
ఇది కూడా చదవండి: Bandla Ganesh: బండ్ల గణేష్తో భేటీ అయిన రేవంత్ రెడ్డి.. 2 గంటలకు పైగా సాగిన చర్చలు!
ఇది కూడా చదవండి: Ajith: అత్యంత ఖరీదైన కారులో అజిత్.. వైరల్గా మారిన ఫొటోలు!