దేశంలో గత కొంత కాలంగా రోడ్డు ప్రమాదాల సంఖ్య విపరీతంగా పెరిగిపోతూ వస్తున్నాయి. ప్రభుత్వాలు ఎన్ని కఠిన ఆంక్షలు విధించినా కొంత మంది డ్రైవర్ల నిర్లక్ష్యం వల్ల ఈ ప్రమాదాలు చోటు చేసుకుంటున్నాయి. అయితే రోడ్డు ప్రమాదం జరిగిన సమయంలో కొంత మంది చూసి చూడనట్లుగా వెళ్తుంటారు.. ఏదైనా జరగకూడనిది జరిగితే పోలీస్ కేసు అవుతుందన్న భయం ఉంటుంది. మరికొంత మంది ప్రమాదం జరిగిన వెంటనే 108 కి ఫోన్ చేసి వారు వచ్చే వరకు చూసి.. అవసరం అయితే బాధితుడికి సహాయంగా వెళ్తుంటారు.
తాజాగా ఏపీ ఆరోగ్యమంత్రి ఆళ్ళ నాని తనలోని మానవత్వాన్ని చాటుకున్నారు. విజయవాడ కొత్త బస్టాండ్ బెంజ్ సర్కిల్ మధ్యలో రోడ్ పక్కన శ్రీనివాస్ రెడ్డి అనే వ్యక్తికి రోడ్డు ప్రమాదంలో తలకు తీవ్రంగా గాయాలు అయ్యాయి. అటు వైపుగా వెళ్తున్న విషయం తెలుసుకొని వెంటనే స్పందించారు. కారు దిగి క్షతగాత్రుడు దగ్గరికి వెళ్లి వివరాలు అడిగి తెలుసుకున్న ఆళ్ళ నాని అధికారులను అప్రమత్తం చేశారు.
ఇది చదవండి : క్యూలో నిలబడితే చాలు.. రోజుకు వేలల్లో ఇస్తారట..
తన కాన్వాయ్ లోని వాహనంలో హాస్పిటల్ కి తరలించారు మంత్రి ఆళ్ల నాని. అంతేకాదు ప్రమాదం జరిగిన వ్యక్తికి సరైన చికిత్స అందించాలని.. హాస్పిటల్ యాజమాన్యంతో ఫోనులో మాట్లాడారు. మంత్రి స్పందించిన తీరుపై ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి. దీనిపై మీ అభిప్రాయాలు కామెంట్స్ రూపంలో తెలియజేయండి.