కొత్త జిల్లాల ఏర్పాటు ఏపీ సీఎం జగన్ ప్రభుత్వానికి కొత్త తలనొప్పులు తెచ్చిపెడుతోంది. ఈ వ్యవహరంలో ప్రజావ్యతిరేకతతో పాటు సొంత పార్టీ నేతల నుంచి తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతోంది. తాజాగా ఈ కొత్త జిల్లాల వ్యవహారంతో పశ్చిమగోదావరి జిల్లా వైఎస్సార్సీపీలోని విభేదాలు తెర మీదకు వచ్చాయి. నర్సాపురంలో మాజీ మంత్రి కొత్తపల్లి సబ్బారాయుడు వర్సెస్ ముదునూరి ప్రసాదరాజు అన్న రేంజ్లో రాజకీయం నడుస్తోంది. బుధవారం నర్సాపురంను జిల్లా కేంద్రంగా ప్రకటించాలని అఖిలపక్షం జేఏసీ ఆధ్వర్యంలో ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మాజీ మంత్రి, వైఎస్సార్సీపీ నేత కొత్తపల్లి సుబ్బారాయుడు పాల్గొని మద్దతు తెలిపారు.
ఈ ర్యాలీ అనంతరం జరిగిన నిరసన దీక్షలో కొత్తపల్లి సుబ్బారాయుడు.. ప్రజల ఎదుట.. స్టేజీ మీద తన చెప్పుతో కొట్టుకున్నారు. నర్సాపురం ఎమ్మెల్యేగా ముదునూరి ప్రసాదరాజును గెలిపించినందుకు తనను తాను చెప్పుతో కొట్టుకున్నట్లు తెలిపారు. ఓ అసమర్థుడ్ని ఎమ్మెల్యేగా గెలిపించి తప్పు చేశానన్నారు. స్థానిక ఎమ్మెల్యేపై సొంత పార్టీ నేత చేసిన వ్యాఖ్యలు కలకలం రేపుతున్నాయి. . ఈ వ్యాఖ్యలపై ఎమ్మెల్యే ముదునూరి ప్రసాదరాజు స్పందించాల్సి ఉంది.
ఏపీలో ప్రస్తుతం ఉన్న 13 జిల్లాలను 26 జిల్లాలు చేయనున్న సంగతి తెలిసిందే. ఏప్రిల్ 2 నుంచి కొత్త జిల్లాల్లో కార్యకలాపాలకు ప్రభుత్వం సిద్ధమవుతోంది. ఇప్పటికే కొత్త జిల్లాలకు సంబంధించిన నోటిఫికేషన్ జారీ చేసిన ప్రభుత్వం ప్రజల నుంచి అభ్యంతరాలు స్వీకరిస్తోంది. ఈ క్రమంలో నర్సాపురం కేంద్రంగా జిల్లా ఏర్పాటు చేయాలని అక్కడి ప్రజలు ఉద్యమిస్తున్నారు. నర్సాపురం పార్లమెంట్ నియోజకవర్గాన్ని జిల్లాగా ప్రకటించిన ప్రభుత్వం.. జిల్లా కేంద్రంగా భీమవరంను ప్రకటించడంపై అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు.
నర్సాపురం కేంద్రంగానే జిల్లా ఏర్పాటు కావాలని డిమాండ్ చేస్తూ ఆందోళనలు చేపడుతున్నారు. అయితే ఈ ఆందోళనలకు స్థానిక ఎమ్మెల్యే ప్రసాదరాజు దూరంగా ఉంటున్నారు. దీంతో మాజీ మంత్రి కొత్తపల్లి సుబ్బారాయుడు ప్రసాదరాజుపై ఆగ్రహంగా ఉన్నారు. గత అసెంబ్లీ ఎన్నికల్లో ప్రసాదరాజు గెలుపుకు సహకరించి తప్పు చేశానని చెబుతూ.. ఏకంగా చెప్పుతో కొట్టుకున్నారు. ఇప్పుడీ అంశం జిల్లాలో హాట్ టాపిక్గా మారింది. దీనిపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.
మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం SumanTV App ని డౌన్లోడ్ చేసుకోండి.