ఏపీ ఆర్థిక శాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి అసెంబ్లీలో బడ్జెట్ ప్రవేశ పెట్టారు. 2022-23 వార్షిక సంవత్సరానికి గానూ 2,56,256 కోట్ల రూపాయలతో బడ్జెట్ రూపొందింది. రెవెన్యూ వ్యయం రూ. 2,08, 261 కోట్లు..మూలధన వ్యయం రూ. 47,996 కోట్లు.. రెవెన్యూలోటు రూ. 17,036 కోట్లు.. ద్రవ్యలోటు రూ. 48,724 కోట్లుగా ఉంది. నవరత్నాల సంక్షేమానికి పెద్ద పీట వేస్తూ ప్రభుత్వం ఈ బడ్జెట్ను తయారు చేసింది. వైఎస్సార్ పెన్షన్ కానుకకు రూ. 18 వేల కోట్లు.. వైఎస్సార్ రైతు భరోసాకు రూ. 3,900 కోట్లు కేటాయించింది.
రంగాల వారీగా కేటాయింపులు ఇలా..
వ్యవసాయం: రూ. 11,387.69 కోట్లు.
వైద్య శాఖ 15,384 కోట్లు.
పశుసంవర్ధకం: రూ. 1568.83 కోట్లు.
బీసీ సంక్షేమం: రూ. 20,962.06 కోట్లు
రోడ్లు, భవనాల శాఖ రూ. 8,581 కోట్లు
పర్యావరణ, అటవీ: రూ. 685.36 కోట్లు.
ఉన్నత విద్య: రూ. 2,014.30 కోట్లు.
విద్యుత్: రూ. 10,281.04 కోట్లు.
సెకండరీ ఎడ్యుకేషన్: రూ. 27,706.66 కోట్లు.
ఎకానమికల్ బ్యాక్ వర్డ్: రూ. 10,201.60 కోట్లు.
సివిల్ సప్లైస్: రూ. 3,719.24 కోట్లు.
ఫైనాన్స్: రూ. 58,583.61 కోట్లు
జీఏడీ: రూ. 998.55 కోట్లు.
సచివాలయ వ్యవస్థ: రూ. 3,396.25 కోట్లు
మహిళా శిశు సంక్షేమం రూ. 4,382 కోట్లు
క్రీడల శాఖ రూ. 290 కోట్లు
పరిశ్రమల శాఖ రూ. 2,755 కోట్లు
హోంశాఖ 7,586 కోట్లు
ఇవి కూడా చదవండి : నా హత్యకు అచ్చెన్నాయుడు కుట్ర పన్నారు: వైసీపీ ఎమ్మెల్సీ