తమిళనాడులోని కోయంబత్తూరు సమీపంలో జరిగిన హెలికాప్టర్ ప్రమాదంలో మరణించిన తెలుగు సైనికుడు సాయితేజ కుటుంబానికి ఏపీ ప్రభుత్వం ఎక్స్ గ్రేషియా ప్రకటించింది. సాయితేజ కుటుంబాన్ని ఆదుకునే విషయమై సీఎం జగన్ అధికారులతో చర్చించారు. అతని కుటుంబానికి సంబంధించిన వివరాలను అధికారులు సీఎంకు వివరించారు. సాయితేజ తన విధి నిర్వహణతో అందరికి ఆదర్శంగా నిలిచారని.. ఆ కారణంతోనే బిపిన్ రావత్ తన వ్యక్తిగత భద్రతాధికారిగా తేజను నియమించుకున్నాడని అధికారులు తెలిపారు. సైనికుడు సాయితేజ కుటుంబానికి రూ. 50 లక్షల ఎక్స్గ్రేషియా ఇవ్వాలని సీఎం జగన్ ఆదేశించారు. ఇంత ఆర్థిక సహాయం చేస్తున్నామంటూ ఎవరు హడావిడి చేయొద్దన్నారు. దీనిపై ఎలాంటి మీడియా ప్రచారానికి అవకాశం ఇవ్వరాదని సీఎం ఆదేశించారు. ఆ కుటుంబాన్ని కలవడానికి ఓ సీనియర్ మంత్రిని సీఎం జగన్ పంపారని సమాచారం.
డిసెంబరు 8న తమిళనాడులోని కూనూర్ సమీపంలోని అడవుల్లో బిపిన్ రావత్ సహా 14 మంది ప్రయాణిస్తున్న M i17 v5 హెలికాప్టర్ ప్రమాదానికి గురైయింది. మరో 5 నిమిషాల్లో గమ్యానికి చేరుకుంటారనే లోపే హెలికాప్టర్ కుప్పకూలిపోయింది. ఈ ప్రమాదంలో త్రివిధ దళాధిపతి బిపిన్ రావత్, ఆయన భార్య సహా 13 మంది ప్రాణాలు కోల్పోయారు. కెప్టెన్ వరుణ్ సింగ్ ఒక్కరే ప్రమాదం నుంచి ప్రాణాలతో బయటపడ్డారు. ఆయన తీవ్రగాయాలతో మిలటరీ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. ప్రాణాలు కోల్పోయిన వారిలో మన తెలుగు తేజం చిత్తురూ జిల్లా వాసి.. సాయితేజ కూడా ఒకరు. ఇప్పుడు వారి కుటుంబాన్ని అన్ని విధాలా ఆదుకుంటామని ఏపీ సీఎం జగన్ తెలిపారు. మన తెలుగు సైనికుడి మరణం పట్ల జగన్ స్పందించిన తీరుపై మీ అభిప్రాయాన్ని కామెంట్స్ రూపంలో తెలియజేయండి.
Andhra Pradesh CM YS Jagan Mohan Reddy has announced Rs 50 lakhs ex-gratia to the family of Lance Naik B Sai Teja, who lost his life in the #TamilNaduChopperCrash crash on 8th Dec, which claimed 13 brave souls. He was serving as PSO to the CDS: Andhra Pradesh CMO
(File photo) pic.twitter.com/DiFzyflnLT
— ANI (@ANI) December 11, 2021