ప్రభుత్వ ఉద్యోగం అంటే చాలా మందికి ఓ చులకన భావన ఉంటుంది. కొందరు విధుల్లో నిర్లక్ష్యంగా ఉంటే.. అవినీతి సొమ్ముకు అలవాటు పడి ప్రజలను పీడించే వారు మరికొందరు ఉన్నారు. ఇలాంటి వారిపై నిత్యం వందల ఫిర్యాదులు వస్తుంటాయి. తరచూ ఏసీబీ అధికారులు ప్రభుత్వ ఆఫీసుల్లో తనిఖీలు చేస్తుంటారు. తాజాగా ఏపీ వ్యాప్తంగా ఏకకాలంలో పలు ప్రభుత్వ కార్యాలయాలపై ఏసీబీ అధికారులు దాడులు చేశారు.
ప్రభుత్వ ఉద్యోగం అంటే చాలా మందికి ఓ చులకన భావన ఉంటుంది. మనం ఏం చేసిన అడిగే వారుండరులే అని కొందరు ఉద్యోగులు భావిస్తుంటారు. అలా కొందరు విధుల్లో నిర్లక్ష్యంగా ఉంటే.. అవినీతి సొమ్ముకు అలవాటు పడి ప్రజలను పీడించే వారు మరికొందరు ఉన్నారు. ఇలాంటి వారిపై నిత్యం వందల ఫిర్యాదులు వస్తుంటాయి. అలానే ఏసీబీ అధికారులు కూడా తనిఖీలు చేసి.. లంచాలు తీసుకునే ఉద్యోగులను అరెస్ట్ చేస్తుంటారు. తాజాగా ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా పలు ప్రభుత్వ కార్యాలయాల్లో ఏసీబీ అధికారులు ఆకస్మిక తనిఖీలు చేశారు. ఏకకాలంలో ఈ దాడులు జరగడంతో రాష్ట్ర వ్యాప్తంగా సంచలనంగా మారింది.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని పలు జిల్లాలోని సబ్ రిజిస్ట్రార్, ఎమ్మార్వో కార్యాలయాలపై అవినితీ నిరోధక శాఖ అధికారులు దాడులు చేశారు. 14400 కాల్ సెంటర్ , యాప్ కి వచ్చిన ఫిర్యాదుల ఆధారంగా ఏసీబీ ఈ తనిఖీలు చేపటింది. కడప జిల్లాలోని బద్వేల్ ఎమ్మార్వో ఆఫీస్, తిరుపతి, అనంతపురం గ్రామీణ, తూర్పుగోదావి జిల్లాలో తుని, నర్సాపురం, నెల్లూరు జిల్లాలోని కందుకూరు, మేడికొండురూ, గుంటూరు, జలమూరు ఎమ్మార్వో ఆఫీసు, శ్రీకాకుళంతో పాటు అనేక కార్యాలయలపై ఏసీబీ అధికారులు ఆకస్మిక తనిఖీలు చేశారు. తనిఖీలు జరుగుతున్న సమయంలో ఇతరులను ఎవరినీ లోపలికి అనుమతించలేదు.
రెవెన్యూ సెక్షన్లో ఆస్తుల క్రయవిక్రయాలకు సంబంధించిన లావాదేవీలు జరిగినప్పుడు యజమానుల పేరు మార్పులకు ఫైల్కు వేలు వసూలు చేస్తున్నారన్న ఆరోపణలు ఉన్నాయి. ఏసీబీ ఆకస్మిక తనిఖీలతో పలు కార్యాలయాల ఉద్యోగులు షాక్ కి గురయ్యారు. ఏపీ డీజీపీ రాజేంద్రనాథ్ రెడ్డి ఆదేశాల మేరకు రాష్ట్ర వ్యాప్తంగా సబ్, రిజిస్టర్, తహశీల్దార్ కార్యాలయల పై ఏసీబీ అధికారుల ఈ తనిఖీలు చేశారు. ఏసీబీ దాడులు చేస్తున్న విషయం తెలిసి… భయంతో పలువురు ఉద్యోగులు ఆఫీసులకు రాలేదు. అలానే ఈ తనిఖీల్లో భాగంగా పలువురు అధికారులను ఏసీపీ అదుపులోకి తీసుకుంది.
రానా నటించిన ‘లీడర్’ తరహాల్లో అవినీతిపై జగన్ ఉక్కుపాదం మోపారని కొందరు అభిప్రాయా పడుతున్నారు. అవినీతి చేస్తున్న ప్రభుత్వ అధికారులను ఆటకట్టించేందుకు ఇలా తనిఖీలు చేశారని మరికొందరు అంటున్నారు. జగన్ – ది గ్రేట్ లీడర్ అంటూ పలువురు ప్రశంసలు కురిపిస్తున్నారు. మున్సిపాల్టీలో జరుగుతున్న అవినీతి అక్రమాలపై అవినితీ నిరోధక శాఖ టోల్ ఫ్రీ నెంబర్కు ఫోన్ ద్వారా ఫిర్యాదులు వెళ్లడంతో ఏసీబీ అధికారులు ఈ తనిఖీలు చేపట్టారు. మరి.. ఏసీబీ అధికారులు ప్రభుత్వ కార్యాలయాల్లో తనిఖీలు చేయడంపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.
ఆంధ్ర ప్రదేశ్ వ్యాప్తంగా రిజిస్ట్రేషన్,ఎమ్మార్వో ఆఫీసుల్లో ఏసీబీ దాడులు.. భయంతో ఆఫీసుకు రాని ఉద్యోగులు
పలువురు అధికారులను అదుపులోకి తీసుకున్న ఏసీబీ
డిజిపి రాజేంద్రనాథ్ రెడ్డి గారి ఆదేశాల మేరకు రాష్ట్ర వ్యాప్తంగా సబ్-రిజిస్టర్ మరియు తహశీల్దార్ కార్యాలయల పై ఏసీబీ అధికారుల… pic.twitter.com/rtkGmzDRjo
— Telugu Scribe (@TeluguScribe) April 27, 2023