ఒక అవమానం ఖరీదు 6 రోల్స్ రాయిస్ కార్లు. ఒక ఇంగ్లీషోడు అవమానించాడని వారం రోజులు వరుసగా వివిధ రంగులతో కూడిన రోల్స్ రాయిస్ కార్లను కొనేసాడు భారత సంతతికి చెందిన వ్యక్తి.
మనిషిలోని కసి, పట్టుదల ఓర్పును కలిగిస్తుంది. ఆ ఓర్పుతో నిత్యం శ్రమించే వారిని ఏదో ఓ రోజు విజయం తప్పక వరిస్తుంది. పనిని భగవంతునిలా భావించి శ్రమించిన వారి చెంతకే విజయం తప్పక చేకూరుతుంది. అందుకు నిదర్శనమే బెంగాల్ కు చెందిన నారాయణ్ మజుందార్. కొన్నేళ్ల క్రితం పాలు అమ్మిన వ్యక్తే.. నేడు కోట్లకు అధిపతిగా మారారు.
జీవితం ఎవ్వరికీ పూల పాన్పు కాదు. ముఖ్యంగా పేదరికంలో పుట్టిన వారికి. పేదవాడు కావాలనుకున్న ప్రతీదాని కోసం ఓ పోరాటం చేయాల్సి వస్తుంది. కలలు పెద్దవి అయ్యేకొద్దీ పోరాటం కొండను ఢీకొన్నట్లుగా ఉంటుంది.
నేటికాలంలో చాలా మందిలో ఆత్మవిశ్వాసం, మానసిక స్థైర్యం అనేవి కొరవడినాయి. అందుకే ప్రతి సమస్యకు భయపడి పోతుంటారు. అన్ని అవయవాలు సరిగ్గా పని చేస్తున్న వారే.. జీవితంలో ఎదరయ్యే సమస్యలకు ఆందోళన చెందుతుంటారు. అయితే ఇలాంటి వారందరు ఓ వ్యక్తిని ఆదర్శంగా తీసుకోవాలి.
శరీరంలో అన్ని అవయవాలు సరిగ్గా ఉన్నవారు.. తమకు ఇంకేదో తక్కువైందని దేవుడిని నిందిస్తుంటారు. అలానే చిన్న పరాజయం పొందగానే తీవ్ర నిరాశకు గురవుతుంటారు. ఇంకా దారుణం ఏమిటంటే తాము జీవితంలో ఏమి సాధించలేకపోయమని మానసిక వేదనకు గురై... ఆత్మహత్యలు సైతం చేసుకుంటున్నారు. కానీ కొందరు వైకల్యం తమను పీడిస్తున్నా.. మొక్కవోని ధైర్యంతో ముందుకుసాగుతూ ఎంతోమందికి స్ఫూర్తిగా నిలుస్తుంటారు. ఆ కోవాకు చెందిన వ్యక్తే తెలంగాణకు చెందిన భాగ్య. వైకల్యం విసిరిన సవాళ్లకి ఎదురీది. విజేతగా నిలిచింది.
తోడికోడళ్లు అంటే కలిసి ఉండకూడదు, ఎప్పుడూ తిట్టుకుంటూ ఉండాలి, కుదిరితే కలబడి కొట్టేసుకోవాలి అని చెప్పి చాలా మంది కొన్ని వందల, వేల లైవ్ ఎగ్జాంపుల్స్ చూపిస్తారు. ఇలాంటి సన్నివేశాలు ఇద్దరు అన్నదమ్ములు ఉన్న ఇళ్లలో ముఖ్యంగా విలేజ్ బ్యాక్ డ్రాప్ లో నడిచే కథల్లో ఎక్కువగా కనబడతాయి అని వాళ్ళూ, వీళ్లూ చెప్తూ ఉంటే మనం వింటూ ఉంటాం. తోడికోడళ్లు 5 నిమిషాలు మాట్లాడుకుంటే.. ఆరో నిమిషంలో పోట్లాడుకుంటారనే ప్రచారం ఉంది. గట్టిగా 10 నిమిషాలు కలిసి ఉండలేని తోడికోడళ్లు.. ఏకంగా 11 ఏళ్ళు కలిసి ఉన్నారంటే గొప్ప విషయమే. కలిసి ఉండడమే కాదు, కలిసి వ్యాపారం కూడా చేస్తున్నారు. బిజినెస్ అంటే మళ్ళీ అల్లాటప్పా యాపారం అనుకునేరు. ఏడాదికి రూ. 600 కోట్లు టర్నోవర్ చేసే బిజినెస్ చేస్తున్నారు.
వయసు 21 ఏళ్ళు. చదివింది బీటెక్. సాఫ్ట్ వేర్ కంపెనీలో ఉద్యోగం చేస్తే జీతం లక్షల్లో వస్తుంది. కానీ తన ఆనందాన్ని నాలుగు గోడల మధ్య కాకుండా నాలుగు గోడల బయట చూసుకుంది. నాలుగు గోడల బయట అయితేనే తనకు ఆనందం దక్కుతుందని భావించి పానీపూరీ వ్యాపారం ప్రారంభించింది. అంత చిన్న వయసులో నెలకు 8 లక్షల నుంచి 9 లక్షలు సంపాదిస్తోంది. సాఫ్ట్ వేర్ ఇంజనీర్ కూడా ఈమె ముందు దిగదుడుపే అనేలా ఆమె సంపాదన ఉంది. మరో విశేషం ఏంటంటే ఆమె బుల్లెట్ బండి మీద తిరుగుతూ పానీపూరీ అమ్ముతుంది.
రైతు వ్యవసాయం తప్ప ఏమీ తెలియదు. కలెక్టర్ అవ్వాలని కలలు కన్నాడు. కానీ ఆ కలలు కలలుగానే మిగిలిపోయాయి. అయితే ఆ రైతు కలను కూతుర్లు నెరవేర్చారు. ఒక కూతురు కాదు, ఐదుగురు కూతుర్లూ కలెక్టర్లు అయ్యి చూపించారు.
ఆమె పేరు చిను కలా. ఒక చినుకులా మొదలైన ఆమె జీవితం ఇవాళ సునామీలా ఒక ప్రభంజనాన్ని సృష్టించింది. లగ్జరీ అన్న పదానికి చోటే లేని పేదరికం ఆమెది. అలాంటిది ఇవాళ కోట్ల రూపాయల విలువైన లగ్జరీ లైఫ్ ఆమెది. ఇంటింటికీ తిరిగి కత్తులు అమ్ముకునే స్టేజ్ నుంచి అతి పెద్ద జ్యువెలరీ బ్రాండ్ కి ఓనర్ గా ఎదిగింది.
ఒక పక్క ఐఏఎస్ అయిన ఆనందం. మరోపక్క పండంటి బిడ్డకు తల్లి అయ్యానన్న సంతోషం. బిడ్డ పుట్టిన రెండు వారాలకే పోస్టింగ్ వచ్చింది. ఇంట్లో ఉండి బిడ్డను చూసుకోవాలా? కార్యాలయానికి వెళ్లి ఐఏఎస్ గా బాధ్యతలు చేపట్టాలా అన్న ప్రశ్న వస్తే ఆమె రెండిటినీ సమర్థవంతంగా బ్యాలెన్స్ చేశారు. ఒక చేత్తో బిడ్డను ఎత్తుకుని.. మరొక చేత్తో ఆఫీస్ పనులు చూసుకున్నారు. ఆమె మరెవరో కాదు సౌమ్య పాండే.