ఆడపిల్లలు ఏం సాధిస్తారు అనే కంటే ముందు సాధిస్తారో లేదో ముందు పరీక్ష పెట్టాలి కదా. కానీ ఆ పరీక్ష పెట్టకుండానే ఏమీ సాధించరు అని స్టాంప్ వేసి వదిలేస్తే ఎలా? ఒక తండ్రి తనకు ఇద్దరు కవల ఆడపిల్లలు పుట్టారని.. వీళ్ళేం సాధిస్తారు అని అనుకుని వదిలేసి వెళ్ళిపోయాడు. కట్ చేస్తే ఇప్పుడు వారు ఊరే గర్వించేలా సాధించారు.
విద్యార్థులు, తల్లిదండ్రులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న తెలంగాణ పదో తరగతి పరీక్షా ఫలితాలు విడుదలయ్యాయి. బుధవారం మధ్యాహ్నం 12 గంటలకు రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి పదో తరగతి పరీక్ష ఫలితాలు విడుదల చేశారు.
ఏడాది మొత్తం కష్టపడి చదివి పదో తరగతి పరీక్షలు రాస్తారు. తీరా పరీక్షలు రాశాక ఫలితాల కోసం రోజుల తరబడి కళ్ళు కాయలు కాచేలా ఎదురుచూస్తారు. ఇటీవలే పదో తరగతి పరీక్షలు ముగిసిన విషయం తెలిసిందే. మరి ఈ పరీక్షలకు సంబంధించి ఫలితాలు ఎప్పుడు వస్తాయంటే?
కండ్లముందే తల్లి విగతజీవిగా పడి ఉన్నా.. ఆ దుఃఖాన్ని దిగమింగుకొని ఆ తల్లి ఆశయం కోసం పరీక్షకు హాజరయ్యాడు ఓ కొడుకు. కన్నీళ్లు తెప్పించే ఈ ఘటన తెలంగాణలోని ఆదిలాబాద్ లో చోటుచేసుకుంది.
తెలంగాణలో టీఎస్పీఎస్సీ పేపర్ల లీక్ వ్యవహారం మర్చిపోకముందే.. పదవ తరగతి ఎగ్జామ్ పేపర్లు వరుసగా లీక్ కావడం రాష్ట్రంలో సంచలనం సృష్టించింది. వికారాబాద్ జిల్లాలో తాండూర్ తెలుగు పేపర్ లీక్ కాగా.. వరంగల్ జిల్లాలో హిందీ పేపర్ లీక్ కావడంతో పెద్ద దుమారం చెలరేగింది. అసలు రాష్ట్రంలో ఏం జరుగుతుందని విద్యార్థులు, తల్లిదండ్రులు ఆందోళన చెందుతున్నారు.
పదో తరగతి ప్రశ్నపత్రాల లీకేజీ వ్యవహారం తెలంగాణ రాష్ట్రాన్ని కుదిపేస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే ఈ వ్యవహారంలో తెలంగాణ రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ పాత్ర ఉందని తేల్చిన పోలీసులు.. అతనిని అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించారు. ఈ క్రమంలో ఏపీ ప్రభుత్వం అప్రమత్తమైంది.పేపర్ లీకేజ్కు తావులేకుండా ఉండేందుకు కఠిన చర్యలు చేపడుతోంది.
మొన్న టీఎస్పీఎస్సీ పరీక్ష పత్రాలు, నిన్న వికారాబాద్ తాండూర్ లో పదో తరగతి ప్రశ్నపత్రాలు లీక్ అయ్యి సంచలనం సృష్టించాయి. ఇవాళ విద్యార్థులు రాసిన పదో తరగతి పరీక్షలకు సంబంధించి ఆన్సర్ షీట్స్ మిస్ అవ్వడం కలకలం రేపుతోంది.
TSPSC పేపర్ లీక్ వ్యవహారం ముగిసిపోకముందే తాజాగా తెలంగాణలో టెన్త్ పరీక్ష పేపర్ లీక్ అయింది. ఈ ఘటన ఇప్పుడు తీవ్ర దుమారం రేపుతోంది. అయితే ఈ పేపర్ లీక్ వ్యవహారాన్ని నడిపించిన వ్యక్తిని పోలీసులు ఎట్టకేలకు అదుపులోకి తీసుకున్నారు. అతను ఎవరో కాదు.
లీకు రాయుళ్లు విద్యార్థుల భవిష్యత్తుతో ఆటలాడుకుంటున్నారు. పబ్లిక్ పరీక్షలు అంటే చాలు.. లీకు రాయుళ్లు రెచ్చిపోతారు. పేపరును ముందుగానే లీక్ చేసి.. పరీక్షల కోసం 24 గంటలూ కష్టపడి చదువుకున్న విద్యార్థుల జీవితాలతో ఆటలాడుకుంటున్నారు.
ఏపీలో రేపటి నుంచి పదో తరగతి పరీక్షలు జరగనున్నాయి. ఈ పరీక్షలు ఏప్రిల్ 3వ తేదీ నుంచి ఏప్రిల్ 18వ తేదీ వరకు జరగనున్నాయి. పదో తరగతి పరీక్షల నిర్వహణకు సర్వం సిద్ధమైంది. పరీక్షల నేపథ్యంలో విద్యార్థులకు అధికారులు పలు కీలక సూచనలు చేశారు.