దిగ్గజ బ్యాంకు దివాలా తీసింది. దీంతో ఈ బ్యాంకుకు చెందిన అనుబంధ సంస్థను అమ్మకానికి పెట్టారు. అయితే ఆ సంస్థ కేవలం రూ.99కే అమ్ముడుపోయింది. దీని వెనుక ఉన్న కారణం ఏంటంటే..!
బ్యాంకింగ్ సంక్షోభం కొనసాగుతోంది. క్రిప్టో డిపాజిట్లు అధికంగా ఉన్న ఒక అతిపెద్ద బ్యాంక్ను క్లోజ్ చేస్తున్నట్లు నియంత్రణ సంస్థలు ఆదివారం సాయంత్రం ప్రకటించాయి.
హిండెన్బర్గ్ నివేదకలు.. గత కొన్ని రోజులుగా భారదేశంలో సంచలనం సృష్టిస్తున్నాయి. ఈ నివేదికల దెబ్బకు గౌతమ్ అదానీ వ్యాపార సామ్రాజ్యం కోలుకోలేని విధంగా దెబ్బతింది. ఇక తాజాగా ఎస్వీబీ బ్యాంక్ వ్యవహారం వెలుగులోకి వచ్చిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో నెటిజనులు హిండెన్బర్గ్పై విమర్శలు చేస్తున్నారు.
యూఎస్ లోని సిలికాన్ వ్యాలీ బ్యాంక్ లో పతనం వల్ల 'లే ఎఫ్' ప్రభావం చాలా గట్టిగానే పడబోతున్నట్లు తెలుస్తోంది. దాదాపు లక్షకు పైగా ఉద్యోగాలు ప్రమాదంలో పడబోతున్నాయని అంటున్నారు.
బ్యాంకింగ్ రంగంలో మళ్లీ ప్రమాద ఘంటికలు మోగుతున్నాయి. ఎప్పుడు, ఏం జరుగుతుందో అని మదుపర్లు తలలు పట్టుకుంటున్నారు. ఎన్నో స్టార్టప్ కంపెనీలకు, టెక్ కంపెనీలకు ప్రాణం పోసిన ఓ బ్యాంక్ ఉన్నపళంగా మూతపడింది. ఆర్థిక కష్టాల నుంచి బయటపడేందుకు ఆ బ్యాంక్ చేసిన ప్రయత్నాలేవీ ఫలించలేదు. డిపాజిట్లు, బ్యాంకు ఆస్తుల మధ్య పొంతన లేకపోవడంతో నియంత్రణ సంస్థలు బ్యాంకును మూసివేయడంతో పాటు ఆస్తులను జప్తు చేశాయి.