బంగాళా ఖాతంలో అల్పపీడనం ఎఫెక్ట్ వల్ల తెలుగు రాష్ట్రాల్లో గత పది రోజుల నుంచి ఎడతెరిపి లేకుండా వర్షాలు కురుస్తున్నాయి. వర్షాల కారణంగా నదులు, చెరువులు, వాగులు పొంగిపొర్లుతున్నాయి. ప్రజలను అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ హెచ్చరించింది.
సాధారణంగా వేటకు వెళ్లే మత్స్యకారులకు కొన్ని సార్లు అరుదైన చేపలు చిక్కుతుంటాయి. వాటి విలువ కొన్ని లక్షల్లో ఉంటాయి. కానీ కొన్ని సార్లు మత్స్యకారులకు నష్టాన్ని కలిగించే షార్క్ చేపలు కూడా వలలో చిక్కుతుంటాయి. శ్రీకాకుళం జిల్లా సంతబొమ్మాళి మండలంలో మత్స్యకారుల వలకు చేప చిక్కింది. మత్స్యకారులు వల లాగుతున్నప్పుడు బరువుగా ఉండటంతో భారీ స్థాయిలో చేపలు పడి ఉంటాయని అంతా సంబరపడ్డారు. తీరా వలను ఒడ్డుకు చేర్చాక లోపల ఉన్న సొర చేపను చూసి అంతా […]