నెల్లూరు రూరల్- ఓ బాలుడు అడవిలో తప్పిపోయాడు. ఆ పిల్లాడి కోసం పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు. తల్లిదండ్రులు కన్న కొడుకు తప్పిపోవడంతో శోకసంద్రంలో మునిగిపోయారు. ఈ విషాదకర ఘటన నెల్లూరు జిల్లాలో చోటుచేసుకుంది. నెల్లూరు జిల్లా కలువాయి మండలం ఉయ్యాలపల్లిలోని అరుంధతి వాడకు చెందిన దండు బుజ్జయ్య, వరలక్ష్మీ దంపతులకు ఇద్దరు పిల్లు. బుజ్జయ్య గొర్రెలు కాస్తుండగా, వరలక్ష్మీ కూలీ పనులు చేసుకుని జీవనం సాగిస్తున్నారు. జూలై 1న బుజ్జయ్య గొర్రెలను మేపడం కోసం సమీపంలోని […]