తెలంగాణ అమర్ నాథ్ యాత్రగా చెప్పుకునే సలేశ్వర జాతర నిన్నటి నుంచి ప్రారంభం అయ్యింది. నాగర్ కర్నూల్ జిల్లా నల్లమల సలేశ్వరం క్షేత్రంలో కొలువైన శివలింగం ఇత్తడితో చేసిన పడగమధ్యలో సలేశ్వరం లింగమయ్య కొలువుదీరి ఉంటాడు. స్వామి వారిని దర్శించుకునేందుకు తెలుగు రాష్ట్రాల నుంచే కాకుండా ఇతర రాష్ట్రాల నుంచి భక్తులు పోటెత్తుతారు.