జనగాం జిల్లా స్టేషన్ ఘన్ పూర్ ఎమ్మెల్యే తాటికొండ రాజయ్య ఓ పుట్టిన రోజు వేడుకలో భావోద్వేగానికి లోనయ్యారు. నియోజకవర్గంలోని కరుణాపురంలో బుధవారం జరిగిన ఓ చర్చి ఫాదర్ బర్త్ డే వేడుకల్లో ఎమ్మెల్యే రాజయ్య ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన ప్రసంగిస్తూ..తనపై వచ్చిన ఆరోపణలకు బాధపడుతూ కన్నీరు పెట్టుకున్నారు.
Rajaiah: టీఆర్ఎస్ సీనియర్ నేత, ఎమ్మెల్సీ కడియం శ్రీహరి తనపై చేసిన వ్యాఖ్యలపై టీఆర్ఎస్ ఎమ్మెల్యే రాజయ్య మండిపడ్డారు. స్టేషన్ ఘన్పూర్ నియోజకవర్గం తన అడ్డా అని అన్నారు. కడియం శ్రీహరి దళిత దొర అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. మంగళవారం మీడియా ప్రతినిధులు ఏర్పాటు చేసిన సమావేశంలో రాజయ్య మాట్లాడుతూ.. ‘‘ కడియం శ్రీహరి నామీద చేసిన అభియోగాలను తీవ్రంగా ఖండిస్తున్నా. ఈ రోజు మాటిమాటికి గురివింద సామెతలెక్క..దొంగే, దొంగ దొంగ అన్నట్లు.. మాట్లాడితే అవినీతి […]