పెరుగుతున్న టెక్నాలజీతో ఎవరి వ్యక్తిగత సమాచారం అంత భద్రం కాదని అందరికీ తెలిసిందే. ఇప్పటికే చాలా రకాల హ్యాక్ లు, సైబర్ అటాక్స్ గురించి విన్నాం. అయితే ఇలాంటి అటాక్స్ విషయంలో ఐఫోన్లు చాలా భద్రంగా ఉంటాయని చెబుతుంటారు. కానీ, ఒక నివేదిక మాత్రం ఐఫోన్లే లక్ష్యంగా ఒక సైబర్ అటాక్ జరిగినట్లు చెబుతున్నారు.
గతేడాది వెలుగు చూసిన పెగాసస్ హ్యాకింగ్ వ్యవహారం దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన విషయం తెలిసిందే. ఇజ్రాయెల్ కు చెందిన ఎన్ఎస్ఓ గ్రూప్ నుంచి కొనుగోలు చేసిన పెగాసస్ సాఫ్ట్వేర్ ద్వారా కేంద్ర ప్రభుత్వం.. చట్టవిరుద్ధంగా దేశంలోని రాజకీయ నాయకులు, జర్నలిస్టులు, సామాజిక కార్యకర్తల ఫోన్లపై నిఘా ఉంచిందనే ఆరోపణలు వచ్చాయి. ముఖ్యంగా రాహుల్ గాంధీ, ప్రశాంత్ కిశోర్, కొందరు కేంద్ర మంత్రులతో పాటు దాదాపు నలభై మంది జర్నలిస్టుల ఫోన్లు లక్ష్యంగా చేసుకున్నట్లు వార్తలు వచ్చాయి. ఈ […]