నిరుద్యోగులకు నేషనల్ కౌన్సిల్ ఆఫ్ ఎడ్యుకేషనల్ రీసెర్చ్ అండ్ ట్రైనింగ్ (ఎన్సీఈఆర్టీ) గుడ్ న్యూస్ చెప్పింది. పలు ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. ఇలాంటి ఉద్యోగాలకు పరిమిత సంఖ్యలో దరఖాస్తు చేస్తారు కనుక ఉద్యోగం సాధించేందుకు నిరుద్యోగులకు ఇదొక మంచి అవకాశమని చెప్పాలి.
ఈ మద్య కాలంలో దేశ వ్యాప్తంగా పలు చోట్ల ఎన్సిఇఆర్టి పాఠ్యపుస్తకాల్లో మార్పులు తీసుకురావడంపై నిరసనలు వెల్లువెత్తుతున్నాయి. విద్యార్థులకు చరిత్ర గురించి తెలియాల్సిన అవసరం ఎంతో ఉన్న సమయంలో వారి చరిత్రలను పాఠ్యాంశాల నుంచి తీసీవేయడం పై పలువురు నేతలు, విద్యార్థి సంఘాలు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు.
పాఠ్యపుస్తకాల్లో చరిత్రకు సంబంధించిన వ్యక్తులు, ఘటనలకు సంబందించిన పాఠాలు ఎప్పటి నుంచో ఉన్నాయి. అయితే గత కొంతకాలంగా మారిన విద్యా విధానం కారణంగా పాఠ్య ప్రణాళిక విషయంలో మార్పులు చోటు చేసుకున్నాయి. అప్రస్తుతం, అవసరం లేనివని చెబుతూ చరిత్రలో కొన్ని పాఠాలను తొలగిస్తున్నారు. మహాత్మా గాంధీకి సంబంధించిన పాఠ్యాంశాలను పాఠ్యపుస్తకాల నుంచి తొలగించారు.