రాజోలు ఎమ్మెల్యే రాపాక వరప్రసాద్ చేసిన వ్యాఖ్యలు ఏపీ రాజకీయాల్లో హీట్ పెంచాయి. తనకు డబ్బులు ఆఫర్ చేశారంటూ సంచలన వ్యాఖ్యలు చేసిన రాపాక.. దొంగ ఓట్ల వల్లే గెలిచానంటూ బాంబు పేల్చారు. ఇది వివాదాస్పదం కావడంతో.. తాజాగా దీనిపై క్లారిటీ ఇచ్చారు రాపాక. ఆ వివరాలు..
ఏపీలో రాజకీయాలు వెేడెక్కాయి. తాజాగా రాజోలు ఎమ్మెల్యే రాపాక వరప్రసాద రావు చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపాయి. టీడీపీ తనకు రూ.10 కోట్లు ఇచ్చేందుకు ప్రయత్నించిందనడమే కాకుండా.. తాను దొంగ ఓట్లు వేస్తే గెలిచానంటూ వ్యాఖ్యానించారు.