కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి, ప్రస్తుతం ఆ రాష్ట్ర అసెంబ్లీలో ప్రధాన ప్రతిపక్ష నేతగా కొనసాగుతున్న సిద్ధరామయ్యకు ఘోర అవమానం జరిగింది. కర్ణాటకలోని కెరూర్ హింసాకాండలో గాయపడిన బాధితులకు సిద్ధరామయ్య అందజేసిన పరిహారాన్ని బాధిత కుటుంబాలకు చెందిన ఓ మహిళ విసిరికొట్టింది. అది కూడా ఆయన ప్రాతినిధ్యం వహిస్తున్న తన సొంత నియోజకవర్గంలోనే చోటుచేసుకోవడం అందరికీ ఆశ్చర్యపరిచింది. వివరాల్లోకి వెళితే.. ఇటీవల కర్ణాటక కెరూర్ లో పెద్దఎత్తున హింసాకాండ చోటు చేసుకున్న విషయం తెలిసిందే. ఈ ఘర్షణల్లో నలుగురు […]