భారత్- పాకిస్థాన్ క్రికెట్ బోర్డుల మధ్య చాలా సంవత్సరాలుగా సఖ్యత లేని విషయం తెలిసిందే. ఈ రెండు జట్లు కలిసి ఐసీసీ టోర్నీలు ఆడతారా లేదా అనే విషయంలో ఇంకా సందిగ్ధత అలాగే కొనసాగుతుంది. అయితే తాజాగా ఇండో-పాక్ మధ్య టెస్ట్ సిరీస్ ప్రస్తావన రావడం ఆసక్తిని కలిగించింది. దీనిపై పాకిస్థాన్ క్రికెట్ బోర్డు చీఫ్ నజం సేథి క్లారిటీ ఇచ్చేసాడు.