క్రికెట్ మ్యాచ్ ను స్టేడియంలో చూస్తేనే మజా.. బ్యాట్స్ మెన్ ఫోర్లు, సిక్సర్లు కొడుతుంటే తోటి ప్రేక్షకులతో కలిసి ఈలలు కొడుతూ.. డ్యాన్స్ లు చేస్తూ.. మ్యాచ్ ను చూస్తే అది మనకు జీవితాంతం గుర్తుకు ఉంటుంది. అయితే ఈ క్రమంలోనే టీమిండియా-సౌతాఫ్రికా ల మధ్య మెుదటి టీ20 మ్యాచ్ కేరళలోని తిరువనంతపురంలో ఉన్న గ్రీన్ ఫీల్డ్ మైదానంలో ఈ నెల 28న జరగనుంది. కానీ ఇప్పుడా మ్యాచ్ జరుగుతుందా?లేదా? అన్నది అనుమానంగా మారింది. దానికి కారణం […]
టీమిండియా, దక్షిణాఫ్రికా జట్ల మధ్య టీ20ల సిరీస్ పోరు రసవత్తరంగా సాగుతోంది. ఈ సిరీస్ ను కైవసం చేసుకునేందుకు భారత్ జట్టుతో పాటు ప్రత్యర్థి జట్టు సైతం పోటీపడుతోంది. ఇక విశాఖలో జరిగిన మూడో పోరులో 48 పరుగుల తేడాతో భారత్ సూపర్ విక్టరీని నమోదు చేసుకుంది. అయితే తొలుత 2-0తో ఆధిక్యంలోకి వెళ్లిన సఫారీల జోరుకు భారత్ ఈ విజయంతో అడ్డుకట్ట వేసినట్లు అయింది. ప్రత్యర్థి ఆధిక్యాన్ని 1-2కు తగ్గించి పంత్ సేన దక్షిణాఫ్రికా జట్టుకు […]
సీనియర్ల గైర్హాజరీతో స్వదేశంలో దక్షిణాఫ్రికాతో జరుగుతున్న టీ20 సిరీస్లో భారత జట్టు దారుణ ప్రదర్శన కనబరుస్తోంది. ఐదు మ్యాచ్ల సిరీస్లో ఇప్పటికే 2-0తో వెనుకంజలో వుంది. రెగ్యులర్ కెప్టెన్ రోహిత్ శర్మకు విశ్రాంతినివ్వడంతో ఈ సిరీస్కు కేఎల్ రాహుల్ నాయకుడిగా వ్యవహరించాల్సి ఉన్నా.. చివరి నిమిషంలో అతడు గాయం కారణంగా దూరమవడంతో రిషబ్ పంత్ను సారథిగా ఎంపిక చేశారు. పంత్ కు.. ఐపీఎల్ లో ఢిల్లీ క్యాపిటల్స్ను నడిపించిన అనుభవం ఉన్న ఉన్నా.. ఆ అనుభవం ఏమాత్రం […]
తొలి టీ20లో ఓడినా రెండో మ్యాచులో గెలిచి సిరీస్ సమం చేస్తారనుకున్న భారత అభిమానులకు టీమిండియా ఆటగాళ్లు నిరాశే మిగిల్చారు. బ్యాటింగ్ లో చేతులెత్తేసిన భారత ఆటగాళ్లు.. బౌలింగ్ లో కూడా విఫలమయ్యారు. పంత్ సేన నిర్దేశించిన 149 పరుగుల లక్ష్యాన్ని దక్షిణాఫ్రికా.. మరో 10 బంతులు మిగిలుండగానే ఛేదించింది. ప్రొటీస్ బ్యాటర్ హైన్రిచ్ క్లాసెన్.. భారత బౌలర్లను ఓ ఆట ఆడుకున్నాడు. దొరికిన బంతిని దొరికినట్టుగా స్టాండ్స్ లోకి పంపాడు. ఇక.. ఈ మ్యాచులో టీమిండియా […]
ఉమ్రాన్ మాలిక్ ఐపీఎల్ 2022లో గంటకు 150 కీ.మీ.పైగా వేగంతో బంతులేస్తూ ప్రత్యర్తి బ్యాటర్లను దడదడలాడించిన సంగతి తెలిసిందే. దిగ్గజ ఆటగాళ్లు సైతం.. ఉమ్రాన్ వేసే స్పీడ్ కు ఆశ్చర్యపోయి నోరెళ్లబెట్టారు. ఐపీఎల్-2022లో 14 సార్లూ ‘ఫాస్టెస్ట్ బాల్’ అవార్డు గెలుచుకున్న ఉమ్రాన్ మొత్తంగా 22 వికెట్లు పడగొట్టి అందరి దృష్టిని ఆకర్షించాడు. ఆ ప్రదర్శనతో ఉమ్రాన్ ఒక్కసారిగా జాతీయ జట్టులో చోటు దక్కించుకున్నాడు. ప్రస్తుతం స్వదేశంలో సౌతాఫ్రికాతో జరుగుతున్న టీ20 సిరీస్ కు ఎంపికైన ఉమ్రాన్ […]
ఢిల్లీ వేదికగా దక్షిణాఫ్రికా, టీమిండియా మధ్య ఆఖరివరకు ఉత్కంఠగా సాగిన తొలి టీ20లో సఫారీలు బోణి కొట్టిన విషయం తెలిసిందే. భారత్ నిర్దేశించిన 212 పరుగుల టార్గెట్ను ఇంకో 5 బంతులు మిగిలి ఉండగానే చేధించారు ప్రొటీస్ ఆటగాళ్లు. పరుగుల వేటలో సఫారీలు చతికిలపడుతున్నారని అనుకుంటున్న సమయంలో డేవిడ్ మిల్లర్, వాండర్ డస్సెన్ అద్భుతంగా రాణించి దక్షిణాఫ్రికాకు అనూహ్య విజయాన్ని అందించారు. అయితే.. ఈ మ్యాచులో ఒకవైపున ఫోర్లు, సిక్సర్లతో బ్యాటర్లు హోరెత్తిస్తుంటే.. మరోవైపు మ్యాచ్ చూడటానికి […]
దేశంలో క్రికెట్ కున్న క్రేజ్ అంతా ఇంతా కాదు. అన్ని మతాల్లానే.. క్రికెట్ కూడా ఒక మతంలా మారిపోయింది. స్వాతంత్య్రం వచ్చిన మొదట్లో ఇంత ఆదరణ ఉండేది కాదు. ఆ సంఖ్య వేలల్లోనే ఉండేది. అందులోనూ అప్పట్లో భారత జట్టు రాణించిన సందర్భాలు చాలా తక్కువ. పేరుకు గొప్ప గొప్ప ఆటగాళ్లు జట్టులో ఉన్నా.. ఇంగ్లాండ్, ఆస్ట్రేలియా, వెస్టిండీస్ లాంటి మేటి జట్లకు తలొంచడం తరచూ చూసేవాళ్లు అభిమానులు. అప్పుడప్పుడూ అగ్రశ్రేణి జట్ల పేస్ బౌలింగ్ ను […]
గత రెండేళ్లుగా ప్రపంచాన్ని పట్టి పీడిస్తున్న కరోనా మహమ్మారి.. క్రికెట్ ప్రపంచాన్ని వదలడం లేదు. ఇప్పటికే.. కరోనా కారణంగా కొన్ని సిరీస్లు వాయిదా పడగా, మరికొన్ని టోర్నీలు ఏకంగా రద్దు అయ్యాయి. ఈ క్రమంలో కరోనా భూతం నుంచి రక్షించేందుకు బయో బబుల్ సెక్యూర్ జోన్ని ఏర్పాటు చేసి, ఆటగాళ్ల కదలికపై అనేక ఆంక్షలు విధిస్తూ వచ్చింది బీసీసీఐ. అయితే.. దేశంలో కరోనా కేసులు తగ్గుముఖం పడుతుండడంతో స్వదేశంలో సౌతాఫ్రికాతో జరుగుతున్న టీ20 సిరీస్లో బయో బబుల్ […]
భారత్ – సౌతాఫ్రికా టీ20 సిరీస్ సమరానికి అంతా సిద్దమైంది. గురువారం రాత్రి 7 గంటలకు ఢిల్లీలోని అరుణ్ జైట్లీ స్టేడియం వేదికగా తొలి టీ20 మ్యాచ్ జరగనుంది. ఈ సిరీస్ కు టీమిండియా సారధిగా రిషబ్ పంత్ కొనసాగనున్నాడు. రోహిత్ శర్మ విశ్రాంతి పేరుతో తప్పుకోవడంతో.. కెప్టెన్సీ బాధ్యతలను కేఎల్ రాహుల్ కు అప్పగించిన విషయం తెలిసిందే. అయితే సిరీస్ ఆరంభానికి ఒక్క రోజు ముందు కెఎల్ రాహుల్ గాయంతో తప్పుకోవడం సంచలనంగా మారింది. ఈ […]
భారత్ – సౌతాఫ్రికా టీ20 సిరీస్ సమరానికి అంతా సిద్దమైంది. గురువారం(జూన్ 9) రాత్రి 7 గంటలకు ఢిల్లీలోని అరుణ్ జైట్లీ స్టేడియం వేదికగా తొలి టీ20 మ్యాచ్ జరగనుంది. భారత్ తో ఐదు మ్యాచుల టీ20 సిరీస్ ఆడేందుకు ఉపఖండానికి వచ్చిన దక్షిణాఫ్రికా జట్టు ఆటగాళ్లు ఎండలకు తట్టుకోలేకపోతున్నారు. దక్షిణాదిలో వాతావరణం కాస్త చల్లబడ్డా ఉత్తరాదిలో మాత్రం భానుడు ఇంకా ప్రతాపం చూపిస్తూనే ఉన్నాడు. ప్రస్తుతం ఢిల్లీలో పగటి ఉష్ణోగ్రతలు 40 డిగ్రీలకుపైగా నమోదవుతున్నాయి. దీంతో […]