ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ కొత్త పుంతలు తొక్కుతోంది. ఇప్పుడు అందరూ ఈ ఏఐ టెక్నాలజీ గురించే మాట్లాడుకుంటున్నారు. మరోవైపు ప్రముఖ టెక్ కంపెనీలు అన్నీ ఈ ఏఐ టెక్నాలజీపై వేల కోట్లు పెట్టుబడులు పెడుతున్నాయి. అయితే కొందరు మాత్రం ఈ కృత్రిమ మేధతో ముప్పులు తప్పవని హెచ్చరిస్తున్నారు.
ఇప్పుడు ఎక్కడ చూసినా ఆర్టిఫిషియల్ ఇంటిలిజెన్స్ గురించే చర్చ జరుగుతోంది. టెక్ దిగ్గజాలు, కంపెనీలు సైతం అన్నీ ఈ ఏఐ టెక్నాలజీ మీద పెద్ద ఎత్తున పెట్టుబడులు పెడుతున్నాయి. తాజాగా ఈ కోవలోకి మెటా సంస్థ కూడా చేరింది.
చాట్ జీపీటీకి పోటీగా గూగుల్ సంస్థ కూడా ఏఐ చాట్ గూగుల్ బార్డ్ ని పరిచయం చేసిన విషయం తెలిసిందే. అయితే ఈ ఏఐ చాట్ బాట్ వల్ల గూగుల్ కి మొదటి నుంచి తలనొప్పులు తప్పడం లేదు. తాజాగా గూగుల్ బార్డ్ తమ సొంత కంపెనీ నిర్ణయంపైనే వ్యతిరేకంగా మాట్లాడి వార్తల్లో నిలిచింది.
గూగుల్ సీఈవో సుందర్ పిచాయ్ పై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. టెక్ నిపుణులు, వినియోగదారులు నుంచి కంటే సొంత ఉద్యోగుల నుంచే ఇప్పుడు సుందర్ పిచాయ్ పై విమర్శలు వినిపిస్తున్నాయి.
ప్రపంచవ్యాప్తంగా ఇప్పుడు ఆర్టిఫీషియల్ ఇంటిలిజెన్స్ గురించే చర్చ జరుగుతోంది. అందులో మరీ ముఖ్యంగా చాట్ జీపీటీ గురించే అంతా మాట్లాడుకుంటున్నారు. ఇప్పుడు ఆ చాట్ జీపీటీ ఒక సబ్ స్క్రిప్షన్ ప్లాన్ తో వినియోగదారుల ముందుకు వచ్చింది.
చాట్ జీపీటీకి పోటీ అంటూ గూగుల్ తీసుకొస్తున్న బార్డ్ ఆల్ఫాబెట్ కంపెనీ కొంప ముంచింది. టెస్టింగ్ లో చేసిన ఒక చిన్న తప్పు ఇప్పుడు ఆ కంపెనీకి లక్షల కోట్లలో నష్టం తెచ్చిపెట్టింది. గూగుల్ మాత్రం టెస్టింగ్ కొనసాగించి అభివృద్ధి చేస్తామంటోంది.