మంత్రి కేటీఆర్ తెలంగాణ వర్షాకాల అసెంబ్లీ సమావేశాల్లో భాగంగా ప్రసంగిస్తూ పొరుగు రాష్ట్ర నాయకులకు ధన్యవాదాలు తెలిపాడు. తెలంగాణ అభివృద్థిపై మాట్లాడుతూ ప్రతిపక్షాలను ఎద్దేవ చేశారు.
ఎపిలో తీవ్ర దుమారం రేపుతున్న వాలంటీర్ వ్యవస్థ వివాదంపై టిడిపి ఎంపీ కేశినేని నాని చేసిన వ్యాఖ్యలు ఇటు టీడీపీ, అటు వైసీపీ వర్గాలను ఆశ్చర్యానికి గురిచేశాయి. వాలంటీర్లు రాజకీయాలకు అతీతంగా పనిచేయాలంటూ మద్దతు తెలపడంపై పలు ఊహాగానాలు తెరపైకి వస్తున్నాయి.