రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రేషన్ డీలర్లకు మంచి రోజులు రాబోతున్నాయి. చాలీచాలని కమీషన్లు, వేతనాలు ఎప్పుడు చెల్లిస్తారో తెలియక ఇబ్బందులు పడుతున్న వారికి ఉపాధి అవకాశాలను పెంచే విధంగా పౌరసరఫరాల శాఖ కసరత్తులు ప్రారంభించింది. అందుకోసం రేషన్ షాపులను త్వరలోనే మినీ బ్యాంకులగా మార్చే ప్రయత్నాలు జరుగుతున్నాయి.