నేటికాలంలో ప్రేమ పేరుతో వెంటపడి వేధించే కేటుగాళ్లు బాగా పెరిగిపోయారు. ప్రేమించి పెళ్లి చేసుకుని తరువాత అసలు నిజస్వరూపం బయటపెట్టి మృగాలు కూడా ఉన్నారు. ఇలా ప్రేమ పేరుతో మాయమాటలు చెప్పే వారిని నమ్మి ఎందరో ఆడపిల్లలు తమ జీవితాన్ని నాశనం చేసుకున్నారు. మరేందరో అనుమానస్పద స్థితిలో మరణిస్తున్నారు. తాజాగా నంద్యాల జిల్లాలో అలాంటి ఘటన ఒకటి చోటుచేసుకుంది.