ఆంధ్రప్రదేశ్ లో త్వరలో ఎన్నికలు రాబోతున్నాయి. ఈ నేపథ్యంలో అధికార, ప్రతిపక్ష నేతలు ప్రజల మద్దతు కోసం ఇప్పటి నుంచి పలు రకాల వ్యూహాలతో ముందుకు సాగుతున్నారు.
ఏపీ ముఖ్యమంత్రిగా పదవీ బాధ్యతలు చేపట్టిన వైఎస్ జగన్ పలు అభివృద్ది కార్యక్రమాలు చేస్తూ వస్తున్నారు. ఈ క్రమంలోనే ఆయన ఎప్పటి నుంచి రైతులు ఎదురు చూస్తున్న చుక్కల భూములకు శాశ్వత పరిష్కారం కల్పించారు.