ఆ మధ్య మధ్యతరగతి వారి కోసం టాటా నానో కారు వచ్చింది. మిడిల్ క్లాస్ వారు కారు ఎక్కాలన్న ఉద్దేశంతో లక్ష రూపాయల బడ్జెట్ లో కారు తయారు చేసి ప్రపంచాన్ని ఆశ్చర్యపరిచారు. ఆ తర్వాత క్రమంగా అది పడిపోయిందనుకోండి. కానీ దాని మీద ఉన్న క్రేజ్ ఇప్పటికీ పోలేదు. అయితే టాటా కంపెనీ ఇప్పుడు భారత్ లో ఐఫోన్ల తయారీకి సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది. భారత్ లో ఉన్న చైనా దేశానికి చెందిన ప్లాంట్ ను కొనుగోలు చేయడానికి రంగం సిద్ధం చేసుకున్నట్లు సమాచారం. ఇది నిజమైతే గనుక టాటా నిర్ణయం సామాన్యులకి వరంగా మారుతుందా? ఐఫోన్ ధరలు తగ్గుతాయా? సామాన్యుడు సైతం కొనేలా ధరలు ఉంటాయా?
ఐఫోన్ అంటే ప్రపంచవ్యాప్తంగా ఉన్న క్రేజ్ ఎలాంటిదో అందరికీ తెలిసిందే. అయితే రాను రాను క్రేజ్, డిమాండ్ అంతా బాగా పెరిగిపోతోంది. ఇప్పటికే ఐఫోన్ 14 సిరీస్ ఫోన్లు మార్కెట్ లో ఉన్నాయి. అప్పుడే ఐఫోన్ 15 సిరీస్ గురించి చర్చలు, వెతుకులాటలు మొదలు పెట్టేశారు. ఐఫోన్ 15 సిరీస్ కి సంబంధించిన ఫీచర్స్, లుక్స్ కి సంబంధించి ప్రచారాలు కూడా జరుగుతున్నాయి.
పెరుగుతున్న టెక్నాలజీతో ఎవరి వ్యక్తిగత సమాచారం అంత భద్రం కాదని అందరికీ తెలిసిందే. ఇప్పటికే చాలా రకాల హ్యాక్ లు, సైబర్ అటాక్స్ గురించి విన్నాం. అయితే ఇలాంటి అటాక్స్ విషయంలో ఐఫోన్లు చాలా భద్రంగా ఉంటాయని చెబుతుంటారు. కానీ, ఒక నివేదిక మాత్రం ఐఫోన్లే లక్ష్యంగా ఒక సైబర్ అటాక్ జరిగినట్లు చెబుతున్నారు.
ఐఫోన్ అంటే ఎవరికి పిచ్చి ఉండదు చెప్పండి. అయితే దానిని కొనేందుకు చాలా మంది ప్రత్నాలు, కృషి చేస్తారు. కొందరు మాత్రం ఆ అది మన రేంజ్ కాదులే అని ఊరుకుంటారు. కానీ, ఒక 7వ తరగతి విద్యార్థిని మాత్రం తాను కోరుకున్న ఐఫోన్ 14ని దక్కించుకుంది. అందుక ఆమె చేసిన పని చూసి అందరూ ఆశ్చర్యపోయారు.
అమెరికా- చైనా మధ్య నెలకొన్న అనిశ్చిత వాతావరణం వల్ల ఎన్నో సంస్థలు, తయారీ యూనిట్లు అయోమయంలో పడిన విషయం తెలిసిందే. అందులో భాగంగానే తైవాన్ కు చెందిన యాపిల్ ఫోన్ తయారీ సంస్థ ఫాక్స్ కాన్ తమ యూనిట్ ని చైనా నుంచి భారత్ తరలించేందుకు నిర్ణయం తీసుకుంది. భారత్ లో మొత్తం రెండు తయారీ యూనిట్లు స్థాపించనున్నారు. ఇప్పటికే బెంగళూరులో ఒకటి స్థాపించనుండగా.. ఇప్పుడు మరో యూనిట్ ని తెలంగాణలో నెలకొల్పనున్నారు.
యాపిల్ కంపెనీ ఉత్పత్తులకు ప్రపంచవ్యాప్తంగా ఎంత గొప్ప పేరు, డిమాండ్ ఉందో అందరికీ తెలిసిందే. ఆ సంస్థ మొదటి నుంచి భారతదేశం విషయంలో ఎంతో సానుకూలంగా వ్యవహరిస్తోంది. భారత్ లో ఆఫ్ లైన్ స్టోర్స్ కూడా స్థాపించేందుకు వేగంగా అడుగులు వేస్తోంది. ఇప్పుడు చైనాలోని ప్లాంట్ ను ఇండియాకి తరలిస్తున్నట్లు చెబుతున్నారు.
ప్రముఖ సోషల్ మేసేజింగ్ యాప్ వాట్సాప్ గురించి ప్రపంచవ్యాప్తంగా తెలియని వారు ఉండరేమో. భారతదేశంలో అయితే దాదాపుగా ప్రతి స్మార్ట్ ఫోన్ లో ఈ సోషల్ మేసేజింగ్ యాప్ ఉంటుంది. ఈ మెసేజింగ్ యాప్ తరచూ అప్ డేట్స్ ఇస్తూ తమ యూజర్లకు సరికొత్త ఫీచర్లను అందుబాటులోకి తీసుకొస్తూ ఉంటుంది.
సోషల్ మెసేజింగ్ యాప్స్ లో వాట్సాప్ కు మంచి ఆదరణ లభించడమే కాకుండా.. చాలా వేగంగా వృద్ది చెందుతోంది. ఎప్పటికప్పుడు కొత్త అప్ డేట్స్, లేటెస్ట్ వర్షన్స్ తీసుకొస్తూ అటు ఆండ్రాయిడ్, ఇటు ఐఓఎస్ యూజర్ల మెప్పు పొందుతోంది.