పాకిస్తాన్ మాజీ కెప్టెన్ షాహిద్ అఫ్రిది మరోసారి భారత్ పై అక్కసు వెళ్లగక్కాడు. ప్రపంచ క్రికెట్పై భారత్ ఆధిపత్యం చెలాయిస్తోందంటూ విమర్శలు చేశాడు. “ప్రపంచ క్రికెట్లో బీసీసీఐ కీలకపాత్ర పోషిస్తోంది. వాళ్లు ఏం చెప్తే అదే ప్రపంచ క్రికెట్లో జరుగుతుంది. క్రికెట్పై భారతదేశం ఆధిపత్యం చెలాయిస్తోంది. ఐపీఎల్ 2022 సీజన్ రెండు నెలల పాటు నిర్వహిచడం వల్ల.. దాని ప్రభావం అంతర్జాతీయ టోర్నీలపై పడుతుంది. ఇండియాలో క్రికెట్ ఆదరణ ఎక్కువ.. ఆ మార్కెట్ను అడ్డుపెట్టుకుని బీసీసీఐ బాగా సంపాదిస్తోంది. ఆ ఆదాయంతోనే ప్రపంచ క్రికెట్ ను శాసిస్తోంది’ అంటూ షాహిద్ అఫ్రిది వ్యాఖ్యానించాడు. అయితే ఉన్నట్టుండి పాక్ మాజీ కెప్టెన్ ఈ వ్యాఖ్యలు చేయడానకి కారణం.. ఇటీవల జరిగిన ఐపీఎల్ ప్రసార హక్కుల వేలానికి సంబంధించే అని తెలుస్తోంది. ఎందుకంటే 2023-2028కి సంబంధించి టీవీ/డిజిటల్ ప్రసార హక్కులను బీసీసీఐ వేలంలో 48 వేల కోట్లకు విక్రయించిన సంగతి తెలిసిందే. ఆ వార్తను జీర్ణించుకోలేకే షాహిద్ అఫ్రిది ఈ వ్యాఖ్యలు చేసినట్లు తెలుస్తోంది. ఎందుకంటే ఓవైపు ఐపీఎల్ ఈ స్థాయిలో దూసుకుపోతుంటే.. పీఎస్ఎల్కు మాత్రం సరైన ఆదరణ లేకపోవడమే కారణంగా కూడా చెప్పుకోవచ్చు. ఇంక ఐపీఎల్ నిర్వహణ విషయానికి వస్తే.. ఏడాదిలో రెండు సీజన్లు ఐపీఎల్ నిర్వహించాలని, నిర్వహించే అవకాశం ఉందని టీమిండియా హెడ్ కోచ్ రవిశాస్త్రి, ఆకాశ్ చోప్రాలాంటి సీనియర్లు అభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు ఈ ఏడాది 10 జట్లతో 74 మ్యాచ్లు నిర్వహిస్తున్న టోర్నీని రానున్న సీజన్లలో 84, 94 మ్యాచ్ల వరకు పెంచాలంటూ బీసీసీఐ భావిస్తోంది. అందుకు ప్రత్యేకంగా మూడు నెలల టైమ్ స్లాట్ ను ఏర్పాటు చేసేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తోంది. అంతేకాకుండా ఆ మూడు నెలలు టోర్నీ నిర్వహించేందుకు మిగిలిన దేశాల బోర్డులను సైతం ఒప్పించేందుకు పావులు కదుపుతోంది. షాహిద్ అఫ్రిది చేసిన వ్యాఖ్యలపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి. Former Pakistan skipper Shahid Afridi hails India as cricket's biggest market : BCCI #Cricket #IPLT20 #CricketNews #ShahidAfridi #CricketTwitter pic.twitter.com/cuQZ0oLMz9 — SportsTiger (@sportstigerapp) June 21, 2022 ఇదీ చదవండి: పాకిస్తాన్ సూపర్ లీగ్ లో తాను అనుభవించిన చీకటి రోజులను బయటపెట్టిన జేసన్ రాయ్! ఇదీ చదవండి: బ్రాత్వైట్ ఓవరాక్షన్! తిక్క కుదిర్చిన అంపైర్!