బర్మింగ్హామ్ వేదికగా భారత్-ఇంగ్లండ్ మధ్య జరుగుతున్న టెస్టులో రిషభ్పంత్ అద్భుతమైన ఇన్నింగ్స్ ఆడాడు. టాస్ ఓడి బ్యాటింగ్కు దిగిన భారత్ను ఆరంభంలో ఇంగ్లండ్ బౌలర్లు కట్టడి చేశారు. వారి ధాటికి టీమిండియా 98 పరుగులకే 5 వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో మునిగిపోయింది. ఈ దశలో రిషభ్ పంత్-జడేజా టీమిండియాను ఆదుకున్నారు. ముఖ్యంగా పంత్ తన ఎటాకింగ్ ప్లేతో ఇంగ్లండ్ బౌలర్లకు చుక్కలు చూపించాడు. 111 బంతుల్లో 20 ఫోర్లు, 4 సిక్సులతో 146 పరుగులు చేసి దుమ్ములేపాడు. దీంతో టీమిండియా తొలి రోజు ఆట ముగిసే సమయానికి 7 వికెట్లు కోల్పోయి 336 పరుగులు చేసి పటిష్టంగా నిలిచింది. రెండు రోజు మరిన్ని పరుగులు జోడిస్తే.. మ్యాచ్ను శాసించే స్థాయి చేరుకుంటుంది. ఇక మ్యాచ్లో అసాధారణ ఆటతీరుతో సెంచరీ సాధించిన పంత్ పలు రికార్డులను కొల్లగొట్టాడు. ఒకటి కాదు రెండు కాదు ఏకంగా అరడజన్పైగా రికార్డులను తన ఖాతాలో వేసుకున్నాడు. టెస్టుల్లో 2000 పరుగులు పూర్తి చేసుకున్న యంగెస్ట్ వికెట్ కీపర్గా నిలిచాడు. అలాగే అవుట్ సైడ్ ఆఫ్ ఆసియా దేశాల్లో అత్యధిక సెంచరీలు చేసిన వికెట్ కీపర్గా పంత్ రికార్డు సృష్టించాడు. పంత్ మొత్తం 5 సెంచరీలు టెస్టుల్లో చేయగా.. వాటిలో నాలుగు ఆసియేతర దేశాల్లో చేసినవే. ఫాస్టెస్ట్ సెంచరీ చేసిన వికెట్ కీపర్గా పంత్ కొత్త చరిత్రను లిఖించాడు. టెస్టుల్లో వేగంగా 2000 పరుగులు పూర్తి చేసిన ఇండియన్ వికెట్ కీపర్ కూడా పంతే. అలాగే ఇండియా తరపున ఆసియేతర దేశాల్లో వేగవంతమైన సెంచరీ చేసిన క్రికెటర్గా పంత్ నిలిచాడు. అలాగే ఎడ్జ్బాస్టన్లో వేగవంతమైన సెంచరీ రికార్డు కూడా పంత్ పేరిట లిఖించబడింది. ఇలా ఇంగ్లండ్పై చేసిన సెంచరీతో పంత్.. టీమిండియాను రక్షించడమే కాకుండా తన ఖాతాలో కూడా అరుదైన రికార్డులు నమోదు చేసుకున్నాడు. ఇక మ్యాచ్ విషయానికి వస్తే.. టాస్ ఓడి ముందుగా బ్యాటింగ్కు దిగిన టీమిండియాకు శుభారంభం దక్కలేదు. జేమ్స్ అండర్సన్ ధాటికి ఓపెనర్లు శుభ్మన్ గిల్(17), చతేశ్వర్ పుజారా(13)లు క్యాచ్ ఔట్గా వెనుదిరిగారు. అనంతరం క్రీజులోకి హనుమ విహారి, విరాట్ కోహ్లీ రాగా.. మ్యాచ్కు వర్షం అంతరాయం కలిగించింది. దాంతో అంపైర్లు ఆటను నిలిపేసి నిర్ణీత సమయం కన్నా ముందుగానే లంచ్ బ్రేక్ను ప్రకటించారు. దాంతో భారత్ 20.1 ఓవర్లలో 53/2 స్కోర్తో లంచ్ బ్రేక్కు వెళ్లింది. వర్షం ఆగిపోయిన అనంతరం ఆట మొదలైంది. వర్షం కారణంగా వృథా అయిన 40 నిమిషాలను అంపైర్లు పొడిగించారు. ఇక సెకండ్ సెషన్ ప్రారంభంలోనే భారత్కు గట్టి షాక్ తగిలింది. మ్యాటీ పోట్స్ తన వరుస ఓవర్లలోనే భారత్కు దిమ్మతిరిగే షాకిచ్చాడు. క్రీజులో సెట్ అయినట్లు కనిపించిన హనుమ విహారి(20)ని వికెట్ల ముందు బోల్తా కొట్టించిన మ్యాటీ.. ఆ మరుసటి ఓవర్లోనే విరాట్ కోహ్లీని క్లీన్ బౌల్డ్ చేశాడు. ఆ తర్వాత క్రీజులోకి వచ్చిన శ్రేయస్ అయ్యర్ బౌండరీలతో దూకుడు కనబర్చాడు. కానీ అండర్సన్ బౌలింగ్లో కీపర్ క్యాచ్గా 15 పరుగులు చేసి ఔటయ్యాడు. దాంతో 98 పరుగులకే టీమిండియా ఐదు వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో పడింది. ఈ పరిస్థితుల్లో క్రీజులోకి వచ్చిన రిషభ్ పంత్.. రవీంద్ర జడేజాతో కలిసి జట్టును ఆదుకున్నాడు. తొలుత కాస్త నిదానంగా ఆడిన ఈ ద్వయం అనంతరం జోరు పెంచింది. పంత్ తనదైన శైలిలో బౌలర్లపై విరుచుకుపడి స్కోర్ బోర్డును పరుగెత్తించాడు. పంత్ సూపర్ బ్యాటింగ్తో భారత్ 44 ఓవర్లలో 174/5 స్కోర్తో సెకండ్ సెషన్ ముగించింది. ఆ తర్వాత మరింత ధాటిగా ఆడగా.. జడేజా అతనికి అండగా నిలుస్తూ స్ట్రైక్ రొటేట్ చేశాడు. పంత్ 89 బంతుల్లో సెంచరీ మార్క్ అందుకున్నాడు. బ్రాడ్ వేసిన 58వ ఓవర్ తొలి బంతికి క్విక్ సింగిల్ తీసిన పంత్.. టెస్ట్ క్రికెట్ కెరీర్లో నాలుగో సెంచరీ తన ఖాతాలో వేసుకున్నాడు. తొలి రోజు ఆట ముగిసే సమయానికి భారత్ 73 ఓవర్లలో 7 వికెట్లు కోల్పోయి 338 పరుగులు చేసింది. క్రీజ్లో జడేజా 83, మొహమ్మద్ షమీ(0) క్రీజ్లో ఉన్నారు. ఇంగ్లండ్ బౌలర్లలో జేమ్స్ అండర్సన్ 3, మ్యాటీ పోట్స్ 2, బెన్స్టోక్స్, జో రూట్ తలో వికెట్ తీసుకున్నారు. మరి పంత్ బ్యాటింగ్పై, నమోదు చేసిన రికార్డులపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి. . -. #ENGvIND @RishabhPant17 pic.twitter.com/4Gyj4hy2BT — Delhi Capitals (@DelhiCapitals) July 2, 2022