జులై 1న ఇంగ్లాండ్తో జరగబోయే టెస్టు నెగ్గి.. టీమిండియా చరిత్ర సృష్టించాలంటూ క్రికెట్ అభిమానులు ఆకాంక్షిస్తున్నారు. ఎందుకంటే.. 2007లో రాహుల్ ద్రవిడ్ సారధ్యంలో ఇంగ్లాండ్ గడ్డపై టీమిండియా చివరిసారి టెస్టు సిరీస్ నెగ్గింది. ఆ తర్వాత 2011, 2014, 2018 సంవత్సరాల్లో అది కలగానే మిగిలిపోయింది. ఆ తర్వాత 2021లో విరాట్ కోహ్లీ కెప్టెన్సీలో పక్కాగా సిరీస్ నెగ్గుతామంటూ అంతా భావించారు. కానీ, ఆ సిరీస్లో నిర్ణయాత్మక ఆఖరి టెస్టు వాయిదా పడిన విషయం తెలిసిందే. ఆ సిరీస్లో భారత్ 2-1తో ఆధిక్యంలో కొనసాగుతోంది. ఎడ్జ్ బాస్టన్ వేదికగా జరగబోయే ఐదో టెస్టును టీమిండియా విజయం సాధిచినా, డ్రాగా ముగించినా కూడా చరిత్ర సృష్టించినట్లౌతుంది. కెప్టెన్గా రాహుల్ ద్రవిడ్ సాధించింది.. హెడ్ కోచ్గా సాధించగలడా? అనే ప్రశ్నకు సమాధానం కావాలంటే వేచి చూడాల్సిందే. అయితే విజయం/డ్రా ఈ రెండూ టీమిండియాకు అంత సులువుగా అందే అవకాశం లేదు. ఎందుకంటే.. ప్రస్తుతం ఇంగ్లాండ్ జట్టులో బెన్ స్టోక్స్, జోస్ బట్లర్, జో రూట్, బెయిర్స్టో బీకర ఫామ్లో ఉన్నారు. జో రూట్ ప్రస్తుతం ఎంతో నిలకడగా, అద్భుతంగా రాణిస్తున్నాడు. ప్రత్యర్థులు ఎవరైనా అంత తేలిగ్గా వికెట్ ఇవ్వడంలేదు.. అలవోకగా శతకాలు బాదేస్తున్నాడు. అటు టీమిండియా మీద కూడా రూట్ చాలా మంచి రికార్డులు ఉన్నాయి. ఐదో టెస్టు జరగబోయే ఎడ్జ్ బాస్టన్ మైదానంలోనూ భారత్ తో ఆడిన రెండు ఇన్నింగ్సుల్లో 94 పరుగులు చేశాడు. Look who's here! Head Coach Rahul Dravid has joined the Test squad in Leicester. #TeamIndia pic.twitter.com/O6UJVSgxQd — BCCI (@BCCI) June 21, 2022 ఇంగ్లాండ్ కెప్టెన్ బెన్ స్టోక్స్ ఇటీవలే కెప్టెన్ గా తొలి సిరీస్ గెలిచిన ఆనందం, దూకుడు మీదున్నాడు. అంతేకాకుండా బెన్ స్టోక్స్ ప్రపంచంలోనే అత్యుత్తమ ఆల్రౌండర్లలో ఒకడు. ఒంటిచేత్తో మ్యాచ్ మొత్తాన్ని మార్చేయగలడు. ఎడ్జ్ బాస్టన్ లో భారత్ తో ఆడిన టెస్టు మ్యాచ్ లో రెండు ఇన్నింగ్సుల్లో కలిపి స్టోక్స్ కొట్టింది 27 పరుగులు మాత్రమే. అలాగని భారత్ పై బెన్ స్టోక్స్ కు భారత్ పై సరైన రికార్డు లేదని కుదుటపడటానికి లేదు. అతను ఎప్పుడైనా అద్భుతాలు సృష్టించగలడు. Hello from Leicester and our training base for a week will be @leicsccc #TeamIndia pic.twitter.com/MAX0fkQcuc — BCCI (@BCCI) June 20, 2022 జోస్ బట్లర్, బెయిర్ స్టో కూడా చాలా ప్రమాదకర ప్లేయర్లు. బట్లర్ ప్రస్తుతం మంచి ఫామ్లో ఉన్నాడు. టెస్టు, టీ20 అని తేడా లేకుండా బౌలర్లను ఎడాపెడా బాదేస్తున్నాడు. ఇటీవల నెదర్లాండ్స్ పై బట్లర్ కేవలం 70 బంతుల్లో 163 పరుగులు స్కోర్ చేయడం చూశాం. అటు ఐపీఎల్-2022 లోనూ రాజస్థాన్ రాయల్స్ తరఫున జోస్ బట్లర్ 863 పరుగులు చేసి ఆరంజ్ క్యాప్ సొంతం చేసుకున్నాడు. అటు బెయిర్స్టో కూడా ఎంతో ప్రమాదకర ఆటగాడు. టెస్టు మ్యాచ్ టీ20 తరహాలో ఆడతాడు. అలా ఆడటమే కాదు.. టీమ్ ను ముందుండి గెలిపిస్తాడు కూడా. తాజాగా నాటింగ్ హామ్ వేదికగా న్యూజిలాండ్ పై 94 పరుగులకే 4 వికెట్లు కోల్పోయిన స్థితి నుంచి టెస్టు మ్యాచ్ ని గెలిపించాడు. 300 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ఇంగ్లాండ్ ను 92 బంతుల్లో 14 ఫోర్లు, 7 సిక్సర్ల సాయంతో 136 పరుగులు చేసి విజయతీరాలకు చేర్చాడు. అలాంటి ప్రమాదకర ఆటగాళ్లు ఉన్న ఇంగ్లాండ్ జట్టును టీమిండియా ఓడించి సిరీస్ గెలవాలంటే చాలా కష్టమనే చెప్పాలి. మరి.. టీమిండియా హెడ్ కోచ్ రాహుల్ ద్రవిడ్ ఎలాంటి ప్రణాళికలు వేస్తాడో. ఇంగ్లాండ్ జట్టును ఎలా కట్టడి చేస్తాడో వేచి చూడాలి. ఇంగ్లాండ్ తో ఐదో టెస్టు గెలిసి టీమిండియా చరిత్ర సృష్టించగలదా? మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి. Practice Strength and Conditioning Coach, Soham Desai, takes us through Day 1⃣ of #TeamIndia's practice session in Leicester as we build up to the #ENGvIND Test. pic.twitter.com/qxm2f4aglX — BCCI (@BCCI) June 21, 2022 ఇదీ చదవండి: విరాట్ కోహ్లీకి కరోనా పాజిటివ్? షాక్ లో ఫ్యాన్స్! ఇదీ చదవండి: క్రిస్ గేల్ ని కలిసిన విజయ్ మాల్యా.. ఫొటోలు వైరల్!