ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు వేడెక్కుతున్నాయి. ఎన్నికలకు రెండేళ్లు సమయం ఉండగానే పొత్తుల చర్చలు తెర మీదకు వచ్చాయి. పొత్తుల విషయంలో తాజాగా పవన్ కల్యాణ్ ఇచ్చిన మూడు ఆప్షన్లపై ప్రస్తుతం ఏపీలో చర్చ నడుస్తోంది. జనసేన ఒంటరిగా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడం.. జనసేన-బీజేపీ కలిసి వెళ్లడం, జనసేన-బీజేపీ-తెలుగుదేశం కలిసి వెళ్లడం. పరోక్షంగా ఈ మూడు ఆప్షన్లలో ఏది ఎంచుకుంటారంటూ తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబునాయుడును పవన్ ప్రశ్నించినట్లైందని సీనియర్ రాజకీయ వేత్తల భావన. ఈ రెండు పార్టీల మధ్య జరుగుతున్న పరిణామాలను అధికార వైసీపీ నిశితంగా పరిశీలిస్తోంది.
పవన్ నుంచి ఆ ప్రకటన వచ్చిన తర్వాత అప్పటివరకు క్షేత్రస్థాయిలో కలిసిమెలిసి ఉంటున్న టీడీపీ, జనసేన నాయకుల మధ్య మాటల యుద్ధం ప్రారంభమైంది. గతంలో చంద్రబాబుకు అవకాశం ఇచ్చాం కాబట్టి ఈసారి పవన్కల్యాణ్కు అవకాశం ఇవ్వాలని కోరుతున్నారు. సీఎం అభ్యర్థిగా పవన్ను ప్రకటించాలని జనసేన నాయకులు డిమాండ్ చేస్తున్నారు. గతంలో జనసేన, టీడీపీ పార్టీల మధ్య ఉన్న సఖ్యత ఇప్పుడు ఉంటుందా? అనేది రాజకీయ విశ్లేషకుల సందేహం. తెలుగులో ఒక సామెతను ఉదహరించినట్లుగా ఆలూ లేదు.. చూలూ లేదు కొడుకు పేరు.. అన్నట్లుగా వీరి ఇరుపార్టీల వ్యవహారం ఉందని కొందరు అభిప్రాయాపడుతున్నారు. అధికారికంగా రెండు పార్టీల మధ్య పొత్తు ఉంటుందా? లేదా? అనేదే ఇంతవరకు స్పష్టత లేదు. కానీ సీఎం పదవి కోసం ఇరు పార్టీల నేతలు పోటాపోటీన వ్యాఖ్యలు చేయడం గమనార్హం.
ఇదీ చదవండి: పొత్తుల లెక్కలో తగ్గని జనసేనాని! ఇరకాటంలో చంద్రబాబు!
ఈ పరిణామాలను తనకు రాజకీయంగా ఎలా ఉపయోగించుకోవాలన్న ఆలోచనలో సీఎం జగన్ మోహన్ రెడ్డి ఉన్నారు. ఈ రెండు పార్టీల మధ్య నెలకొన్న పరిణామాలను తనకు అనుకూలంగా మార్చుకొని సాధ్యమైనంత త్వరగా ముందస్తు ఎన్నికలకు వెళ్లి మళ్లీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ సన్నాహాలు చేసుకొవచ్చని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. మరి.. విషయాలపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.