ప్రముఖ నటుడు, నిర్మాత మంచు మోహన్ బాబుకు హైదరాబాద్ ఎర్రమంజిల్ 23 మెట్రోపాలిటిన్ స్పెషల్ మేజిస్టేట్ కోర్టు ఏడాది పాటు శిక్షను ఖరారు చేసిందని వార్తలు వస్తున్న నేపథ్యంలో తనపై వస్తున్న వార్తలపై ఆయన స్పందించారు. మీడియాకు వివరణ ఇచ్చిన ఆయన.. “2009లో సలీమ్ సినిమా చేస్తున్న సమయంలో ఆ సినిమాకు సంబంధించిన మొత్తాన్ని దర్శకుడు వైవిఎస్ చౌదరికి చెల్లించేశాం… మా బ్యానర్లోనే మరో సినిమా చేయడానికిగానూ ఆయనకు రూ.40లక్షల చెక్ ఇచ్చాం.
“సలీమ్” అనుకున్న స్థాయిలో విజయం సాధించకపోవడంతో.. వైవిఎస్ చౌదరితో తదుపరి చేయాల్సిన సినిమాను వద్దనుకున్నాం… సినిమా చేయడం లేదని వైవిఎస్ చౌదరి చెప్పాం… అలాగే చెక్ ను బ్యాంకులో వేయవద్దని కూడా చెప్పాం… అయినా కూడా కావాలనే చెక్ బ్యాంకులో వేసి చెక్ బౌన్స్ చేశారు. నాపై చెక్ బౌన్స్ కేసుని వేసి. కోర్టును తప్పు దోవ పట్టించారు. దాంతో వారికి అనుకూలంగా తీర్పు వచ్చింది. ఈ తీర్పుని మేం సెషన్స్ కోర్టులో ఛాలెంజ్ చేస్తున్నాం… కొన్ని చానెల్స్ లో నాపై వస్తున్న తప్పుడు ఆరోపణలను నమ్మవద్దు” అంటూ ఆయన అభిమానులకు YCP కార్యకర్తలకు పిలుపునిచ్చారు మోహన్ బాబు.