
కరోనా వైరస్ కారణంగా మనుష్యులు తమ తోటివారికి సాయం చేసేందుకు ముందుకు వస్తున్నారు. ఇప్పటికే అన్ని రంగాలకు చెందిన ప్రముఖులు ఇతరులకు సాయం చేసేందుకు ఆసక్తి చూపుతున్నారు. ఇప్పటికే ఈ జాబితాలో రాజకీయ నేతలు మొదలుకొని సినీ ప్రముఖుల వరకు ఉన్నారు. కాగా వారిలో భారతేదశ వ్యాప్తంగా తనకంటూ ప్రత్యేక గుర్తింపును తెచ్చుకున్నాడు. అయితే ఇప్పుడు సినీ ఇండస్ట్రీకి చెందిన పలువురు కరోనా నేపథ్యంలో తమవంతు సాయం చేసేందుకు ముందుకు వస్తున్నారు.
ఇటీవల మెగాస్టార్ చిరంజీవి సినీ కార్మికుల కోసం CCC అనే సంస్థను ఏర్పాటు చేసి దాని ద్వారా సాయం అందిస్తున్నారు. కాగా మరో స్టార్ హీరో నందమూరి బాలకృష్ణ కూడా ఇప్పటికే పలువురికి సాయం అందిస్తున్నాడు. గతంలో సినీ కార్మికుల కోసం రూ. 1.25 కోట్లు అందజేయగా, ఇప్పుడు ఎమ్మెల్యే హోదాలో తన నియోజకవర్గం అయిన హిందుపూర్లోని కరోనా సెంటర్కు అవసరమైన రూ.55 లక్షల విలువైన పీపీఈ కిట్లు, మాస్క్లు మరియు ఇతర సామగ్రిని అందించేందుకు ముందుకు వచ్చారు. దీంతో హిందుపూర్ ప్రజలు బాలయ్య చేస్తున్న మంచిపనికి ఫిదా అవుతున్నారు.
గతంలో బసవతారకం క్యాన్సర్ ఆసుపత్రి ద్వారా 12 వేల మందికి కరోనా నిరోధక హోమియోపతి మందులను అందించిన సంగతి తెలిసిందే. ఇలా వరుసగా కరోనా మహమ్మారి నుండి కాపాడుకునేందుకు ప్రజలకు, అధికారులకు అవసరమై మందులు, నివారణ సామగ్రిని అందిస్తూ ఇతరులకు స్పూ్ర్తిగా నిలుస్తున్నాడు బాలయ్య. ఇక సినిమాల విషయానికి వస్తే బాలయ్య ఇప్పటికే తన కొత్త చిత్రాన్ని మాస్ చిత్రాల దర్శకుడు బోయపాటి శ్రీను డైరెక్షన్లో ప్రారంభించిన సంగతి తెలిసిందే.