ఎన్నికలు దగ్గరపడుతున్న ఈ సమయంలో అంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయ సమీకరణాలు మారుతున్నాయి. పార్టీలు మారుతున్న MLAలు, MP ల సంఖ్యా ఎక్కువవుతుంది. ఈమధ్యే MLA ఆమంచి టీడీపిని వీడి YCPలో చేరిన విషయం తెలిసిందే.. ఆమంచి ఇంకా అధికారికంగా YCP కండువా కప్పుకోకపోయినా… జగన్ తో కలిసి అన్ని మాట్లాడాడు. YCP చేరుతున్నాను అని ఇప్పటికే చెప్పేసాడు ఆమంచి.
ఇలాంటి సమయంలో టీడీపి పార్టీకి మరో ఎదురు దెబ్బ తగిలింది.. అనకాపల్లి MP అభ్యర్థిగా ఉన్న అవంతి శ్రీనివాస్ టీడీపి పార్టీకి రాజీనామా చేసారు. అతడు కుడా జగన్ పార్టీలో చేరిపోయాడు.. ఈరోజు సాయంత్రం 4గంటల సమయంలో “లోటస్ పాండ్” లో జగన్ ని కలిసి YCP కండువా కప్పుకున్నాడు అవంతి శ్రీనివాస్.. అనంతరం మీడియా ముందుకొచ్చిన అవంతి ప్రత్యేక హోదా కోసం ఒక జగన్ మాత్రమే నిజాయితీగా పోరాడాడు. అందుకే నేను జగన్ వెంటే నడవాలని భావించి YCP లో చేరానని వివరించాడు.
ఇదిలాఉంటే మరో TDP నేత కూడా YCPలోకి వెళ్తున్నడని జోరుగా ప్రచారం సాగుతుంది. అతడే అమలాపురం ఎంపీ “పండుల రవీంద్రబాబు”. ఇతడుకూడ YSRCPలో చేరతారని సోషల్ మీడియాలో జోరుగా ప్రచారం జరుగుతోంది. ఈ నేపథ్యంలో MP రవీంద్రబాబు స్పందించారు. తిరుమల శ్రీవారిని దర్శించుకునేందుకు వెళ్లిన ఆయన మీడియాతో మాట్లాడుతూ… “నేను YCPలో చేరుతున్నాననే ప్రచారంలో వాస్తవం లేదు.. ఏది ఏమైనా తెలుగుదేశం పార్టీని వీడే ప్రసక్తే లేదు” అని ఖండించారు. అలాగే ఆంధ్ర రాష్ట్ర అభివృద్ది ఒక చంద్రబాబుతోనే సాధ్యమని కుండ బద్దలు కొట్టారు రవీంద్రబాబు.