గత కొంత కాలంగా తెలంగాణలో రాజకీయాలు బాగా వేడెక్కిపోతున్నాయి. ఎవరి బలాలు వారు నిరూపించుకునేందుకు గట్టి పట్టుమీద ఉన్నారు. ఈ క్రమంలో బీజేపీ అగ్రనేత, కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా తెలంగాణకు విచ్చేశారు. ఇటీవల బీజేపీ తెలంగాణ అధ్యక్షుడి హోదాలో ప్రజా సంగ్రామ యాత్ర పేరిట పాదయాత్ర చేసిన బండి సంజయ్ తన యాత్రను శనివారం ముగించారు. రంగారెడ్డి జిల్లా తుక్కుగూడలో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో పాల్గొన్న ఆయన అధికార పార్టీపై నిప్పులు కురిపించారు.
అమిత్ షా మాట్లాడుతూ.. తెలంగాణ ఉద్యమ సమయంలో నీళ్లు, నిధులు, నియామకాలను సాధిస్తామని హామీలిచ్చి అధికారంలోకి వచ్చిన కేసీఆర్… ఆ హామీలను తుంగలో తొక్కారని విమర్శించారు. బీజేపీ అధికారంలోకి రాగానే నీళ్లు, నిధులు, నియామకాల హామీలను నెరవేరుస్తామని ఆయన చెప్పారు. తెలంగాణ రాష్ట్రాన్ని ఒకే కుటంబం పాలిస్తుందని.. బండి సంజయ్ ప్రజల కోసం పోరాడుతున్నాడని అన్నారు. బీజేపీ బడుగు, బలహీన వర్గాల అభివృద్ది కోసం ఎంతగానో కష్టపడుతుందని అన్నారు.
గతంలో నిజాం ప్రభుత్వం తెలంగాణ ప్రజలను ఏ విధంగా పాలించి ఇబ్బందులకు గురి చేసిందో ఇప్పుడు నయా నిజాం ప్రభువు కేసీఆర్ పాలన కూడా అలాగే ఉందని అన్నారు. అప్పట్లో హైదరాబాద్ విముక్తి సర్దార్ వల్లభాయ్ పటేల్ వల్లే సాధ్యమైందని అమిత్ షా చెప్పారు. తెలంగాణలో కేసీఆర్ కుటుంబ నుంచి ఇప్పటికీ కొడుకు, కూతురు, అల్లుళ్లు పాలనలోకి వచ్చారు.. ఇంకా ఎందమంది వస్తారో తెలియదని అన్నారు. ఇక తెలంగాణలో బీజేపీ కుటుంబ పాలనకు చరమగీతం పాడుతుందని అన్నారు.
గతంలో నిజాం ప్రభుత్వం తెలంగాణ ప్రజలను ఏ విధంగా పాలించి ఇబ్బందులకు గురి చేసిందో ఇప్పుడు నయా నిజాం ప్రభువు కేసీఆర్ పాలన కూడా అలాగే ఉందని అన్నారు. అప్పట్లో హైదరాబాద్ విముక్తి సర్దార్ వల్లభాయ్ పటేల్ వల్లే సాధ్యమైందని అమిత్ షా చెప్పారు. తెలంగాణలో కేసీఆర్ కుటుంబ నుంచి ఇప్పటికీ కొడుకు, కూతురు, అల్లుళ్లు పాలనలోకి వచ్చారు.. ఇంకా ఎందమంది వస్తారో తెలియదని అన్నారు. ఇక తెలంగాణలో బీజేపీ కుటుంబ పాలనకు చరమగీతం పాడుతుందని అన్నారు.