ప్రస్తుత రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ పదవీ కాలం జులై 24వ తేదీతో ముగియనుంది. ఆయన స్థానంలో కొత్తగా రాష్ట్రపతిని ఎన్నుకునేందుకు కేంద్ర ఎన్నికల సంఘం నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ నేపథ్యంలో దేశ రాజధాని ఢిల్లీలో రాష్ట్రపతి ఎన్నికల సందడి వాతారణం నెలకొంది. అధికార బీజేపీ ఎన్డీయే కూటమి నుంచి ఒడిశాకు చెందిన ఆదివాసి బిడ్డ, మాజీ గవర్నర్ ద్రౌపతి ముర్మును రాష్ట్రపతి అభ్యర్థిగా ప్రకటించింది. ఇక విపక్షాల నుంచి ఉమ్మడి అభ్యర్థిగా మాజీ కేంద్ర మంత్రి, ప్రస్తుత టీఎంసీ ఉపాధ్యక్షులు యశ్వంత్ సిన్హాను ఎంపిక చేసింది. ఓ గిరిజన మహిళను రాష్ట్రపతి అభ్యర్థిగా ఎంపిక చేయడంపై సర్వత్రా హర్షవ్యక్తమవుతోంది. పలువురు ప్రముఖులు ఈ నిర్ణయాన్ని సమర్థిస్తున్నారు.
బీజేపీ నేషనల్ చీఫ్ జేపీ నడ్డా తమ అభ్యర్థిగా ద్రౌపతి ముర్మును ప్రకటించిన వెంటనే మద్యప్రదేశ్ ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ ఆనందానికి పగ్గాలు లేకుండా పోయాయి. ఈ క్రమంలో మధ్యప్రదేశ్ రాష్ట్ర సీఎం శివరాజ్ సింగ్ చౌహాన్ గిరిజనులు, బీజేపీ నేతలతో కలిసి డాన్స్ చేసి సందడి చేశారు. సీఎం శివరాజ్ సింగ్ గిరిజనుల దుస్తులు ధరించి, చేతుల్లో నెమలి ఈకలు, విల్లు చేతబట్టి గిరిజన మహిళలతో కలిసి పాటకు డాన్స్ చేశారు. ఎన్డీయే రాష్ట్రపతి అభ్యర్థిగా ద్రౌపది ముర్ము ఎంపిక చేయడం పట్ల చాలా సంతోషిస్తున్నట్లు సీఎం చౌహాన్ ట్విట్టర్లో పంచుకున్నారు. ఈ వీడియో నెట్టింట వైరల్ అవుతుంది.
రాష్ట్రపతి అభ్యర్థినిగా ద్రౌపది ముర్ము మరికొద్ది సేపట్లో నామినేషన్ వేయనున్నారు. ప్రధాని మోడీ సహా కేంద్ర మంత్రులు, ఇతర రాష్ట్రాల ముఖ్య నేతలు ఈ నామినేషన్ కార్యక్రమంలో పాల్గొనున్నారు. ఇక విపక్షాల రాష్ట్రపతి అభ్యర్థిగా కేంద్ర మాజీ మంత్రి యశ్వంత్ సిన్హా జూన్ 27న నామినేషన్ దాఖలు చేయనున్నారు. నామినేషన్లు జూన్ 29వ తేదీలోగా సమర్పించాల్సి ఉంటుంది. జూలై 18న రాష్ట్రపతి ఎన్నికల పోలింగ్, జులై 21 లోగా ఎన్నికల ఫలితాలు వెల్లడి కానున్నాయి. ఈ విషయం పై మీ అభిప్రాయాలు కామెంట్స్ రూపంలో తెలియజేయండి.
आदरणीय श्रीमती द्रौपदी मुर्मू जी को राष्ट्रपति पद की उम्मीदवार बनाने पर मा. प्रधानमंत्री श्री @narendramodi जी एवं राष्ट्रीय नेतृत्व के आभार कार्यक्रम से पूर्व जनजातीय भाई-बहनों के साथ उनके अद्वितीय लोक नृत्य एवं संगीत का साथी श्री @vdsharmabjp जी के साथ आनंद लिया। pic.twitter.com/aiN9yJELvk
— Shivraj Singh Chouhan (@ChouhanShivraj) June 23, 2022