ఈ మద్య అడవుల్లో ఉండాల్సిన క్రూర మృగాలు పల్లెలు, పట్టణాల్లోకి చొరబడుతున్నాయి. ఎక్కువగా చిరుత పులులు, ఎలుగు బంట్లు ప్రజలపై దాడులు చేసి గాయపరుస్తున్నాయి.. చంపుతున్నాయి. అంతేకాదు జనావాసాల్లో ఉండే సాధుజంతువులపైన దాడి చేసి ఎత్తుకెళ్తున్నాయి. ఇలాంటి సంఘటనలు సీసీ టీవీ ఫుటేజ్ లో రికార్డు అయి వెలుగులోకి వచ్చాయి. చిరుత పులుల సంచారంతో పట్టణ, గ్రామాల ప్రజలు తీవ్ర భయాందోళనలకు గురవుతున్నారు. ఈ క్రమంలో ఓ చిరుతపులి జనావాసాల్లో తిరుగుతూ.. అక్కడే ఉన్న మామిడి చెట్టుపై సేద తీరుతుంది. ఇది చూసిన జనాలు భయంతో వణికిపోతున్నారు. ఈ ఘటన పశ్చిమబెంగాల్లోని చోటు చేసుకుంది. పశ్చిమబెంగాల్లోని అలీపుర్ద్వార్ జిల్లా షిల్బరీహట్ ఘాట్పడ్ పరిసర ప్రాంతంలో గత కొంత కాలంగా చిరుత హల్ చల్ చేస్తుంది. గత కొన్ని రోజుల నుంచి ఆ చిరుత జనావాసాల్లో తిరుగుతూ జనాలను వేటాడుతుందని.. ఇప్పటికే దీని భారిన పడి చాలా మంది గాయాలపాలయ్యారని, కొంతమంది చనిపోయారని గ్రామస్థులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ క్రమంలో మంగళవారం రబియుల్ అనే వ్యక్తి ఇంటి పక్కన ఉన్న ఓ మామిడి చెట్టుపై ఆ చిరుతు సేద తీరుతున్నట్లు గ్రామస్థులు చూశారు. మామిడి చెట్టుపై ఉన్న చిరుత గురించి అధికారులకు సమాచారం అందించారు. రంగంలోకి దిగిన అటవీ, అగ్నిమాపక, పోలీసు సిబ్బంది ఆ చిరుతకు మత్తు ఇన్ జక్షన్ ఇచ్చి అదుపులోకి తీసుకున్నారు. ప్రస్తుతం దీనికి సంబంధించిన ఓ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఈ విషయం పై మీ అభిప్రాయాలు కామెంట్స్ రూపంలో తెలియజేయండి.