నేషనల్ హెరాల్డ్ కేసులో రాహుల్ గాంధీపై ఈడీ నమోదు చేసిన కేసులకు వ్యతిరేకంగా ఆ పార్టీకి చెందిన నేతలు, కార్యకర్తలు ఆందోళనలు చేపడుతున్నారు. అయితే.. ఈ ఆందోళనల్లో నేతలు ఆగ్రహావేశాలకు గురవుతున్నారు. ఇటీవలే కాంగ్రెస్ సీనియర్ నేత రేణుకా చౌదరి.. ఓ పోలీసు అధికారి కాలర్ ను పట్టుకున్న ఘటన మరువక ముందే మరోసారి పోలీసులకు ఘోర అవమానం జరిగింది. ఆలిండియా మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు నెట్టా డిసౌజా పోలీసుల పట్ల అనుచితంగా ప్రవర్తించారు. వివరాల్లోకి వెళితే..
ఢిల్లీలోని ఈడీ కార్యాలయానికి వెళ్లిన రాహుల్ గాంధీని అధికారులు సుదీర్ఘంగా విచారిస్తున్నారు. ఈడీ విచారణను నిరసిస్తూ.. ఢిల్లీలో కాంగ్రెస్ నాయకులు ఆందోళన నిర్వహించారు. అయితే, ఈడీ కార్యలయం దగ్గర ఆందోళన చేస్తున్నవారిని పోలీసులు అదుపులోనికి తీసుకుని ప్రత్యేక వాహానంలో ఎక్కించారు. ఈ క్రమంలో ఆలిండియా మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు నెట్టా డిసౌజా ని కూడా పోలీసులు వాహనంలోకి ఎక్కించారు. ఆ సమయంలో పోలీసులకు, ఆమెకు మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. ఈ క్రమంలో ఆమె పోలీసుల పట్ల దురుసుగా ప్రవర్తించడమే కాకుండా.. పోలీసులపై ఉమ్మివేశారు. వెంటనే మహిళా పోలీసులు షాక్ కు గురయ్యారు. అక్కడి నుంచి కాస్త వెనుక వైపు జరిగారు.
ప్రస్తుతం దీనికి సంబంధించిన ఫొటోలు, వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. నెట్టా డిసౌజా ఒక ప్రజా ప్రతినిధి అయి ఉండి.. పోలీసుల పట్ల అనుచితంగా ప్రవర్తించిన తీరును నెటిజన్లు తప్పుబడుతున్నారు. కాగా, దీనిపై నెట్టా డిసౌజా స్పందించారు.. ఆ సమయంలో తన నోటిలో మట్టి పడిందని, అనుకోకుండా దాన్ని బయటకు ఉమ్మానని.. కానీ పోలీసులపై ఉమ్మాలని కాదని వివరణ ఇచ్చారు. తనకు పోలీసులంటే అపారమైన గౌరవ, మర్యాదలు ఉన్నాయని తెలిపారు. ఈ విషయం పై మీ అభిప్రాయాలు కామెంట్స్ రూపంలో తెలియజేయండి.
#WATCH | Mahila Congress President Netta D’Souza spits at police personnel during a protest with party workers in Delhi against ED for questioning Congress leader Rahul Gandhi in the National Herald case. pic.twitter.com/cPBIntJq1p
— ANI (@ANI) June 21, 2022