సాధారణంగా కంపెనీలు.. ఉద్యోగుల ప్రతిభ, వారి పని తీరు ఆధారంగా జీతాలు పెంచడం, బోనస్లు ఇవ్వడం చేస్తుంటాయి. ఇక సెలవుల విషయంలో ప్రతి కంపెనీకి ఓ పాలసీ ఉంటుంది. దాని ప్రకారమే సెలవులు మంజూరు చేస్తుంది. క్యాజువల్ లీవ్స్, సిక్ లీవ్స్ పేరిట కంపెనీల్లో రకరకాల లీవ్స్ ఉంటాయి. అయితే ఏ కంపెనీ కూడా ఉద్యోగులకు అధిక మొత్తంలో సెలవులు ఇవ్వదు. ఏదో తీవ్ర అనారోగ్య సమస్య ఉంటే తప్ప.. నెలల పాటు సెలవులు మంజూరు చేయదు. కానీ ఇప్పుడు మీరు తెలుసుకోబోయే కంపెనీ ఇందుకు పూర్తి భిన్నమైంది. ఈ కంపెనీ పిల్లల్ని కనమని తన ఉద్యోగులను ప్రోత్సాహింస్తోంది. అందుకు గాను ఏకంగా 11.50 లక్షల బోనస్తో పాటు.. ఏడాది పాటు సెలవులు కూడా మంజూరు చేస్తామని ప్రకటిస్తుంది. సదరు కంపెనీ నిర్ణయంపై నెటిజనులు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు . ఆ వివరాలు..
ప్రపంచలో అత్యధిక జనాభా గల దేశాల్లో చైనా ప్రథమ స్థానంలో ఉంది. ఈ క్రమంలో దేశ జనాభాను నియంత్రించేందుకు గాను చైనా 1980 దశకంలో ఒక్కరు ముద్దు.. లేదా అసలే వద్దు అనే నిబంధనను తీసుకొచ్చింది. అయితే దాని ప్రభావం ఎంత దారుణంగా ఉంటుందో అర్థం కావడానికి చైనాకు సుమారు 30 ఏళ్లకు పైగానే పట్టింది. ఒక్కరు ముద్దు.. లేదా అసలే వద్దు నిబంధనను అమల్లోకి తేవడంతో.. చాలా మంది పిల్లల్ని కనలేదు. ఫలితంగా చైనాలో వృద్ధులు జనాభా గణనీయంగా పెరగడమే కాక.. యువతరం సంఖ్య భారీగా పడిపోయింది. దాంతో పరిస్థితిని అర్థం చేసుకున్న వెంటనే ఆ నిబంధనను 2016లో రద్దు చేసింది. అంతేకాక జనాభాను పెంచేందుకు గాను 2021లో ముగ్గురు పిల్లల పాలసీని ప్రవేశపెట్టింది.
ఇది కూడా చదవండి: భార్య మీద అలిగిన భర్త.. 14 ఏళ్లుగా ఎయిపోర్టులోనే..
కానీ పెరుగుతున్న ఖర్చులు, చాలీచాలనీ ఆదాయాన్ని దృష్టిలో పెట్టుకుని చాలామంది చైనీయులు ఒక్క బిడ్డను మాత్రమే కనడానికి ఆసక్తి చూపుతున్నారు. ఈ క్రమంలో ప్రభుత్వం.. ఎక్కువ మంది పిల్లల్ని కనేలా ఉద్యోగులను ప్రోత్సాహించేలా చూడాలని కంపెనీలకు ఆదేశాలు జారీ చేసింది. దీనిలో భాగంగా చైనాలోని బీజింగ్లో ఉన్న దబీనాంగ్ టెక్నాలజీ గ్రూప్ కంపెనీ తమ కంపెనీ ఉద్యోగుల్లో మూడో సంతానానికి జన్మనిచ్చిన ఉద్యోగికి 90 వేల యువాన్లను బోనస్గా ప్రకటించింది. అంటే మన కరెన్సీలో చెప్పాలంటే.. 11.50 లక్షల రూపాయలన్నమాట. తమ కంపెనీలో పని చేసే మహిళా ఉద్యోగులకు బోనస్తోపాటు ఒక ఏడాది.. అదే పురుషులకైతే.. 9 నెలల పాటు సెలవులు ఇస్తామని ప్రకటించింది. ఇక రెండో సంతానికి జన్మనిస్తే.. 60 వేల యూవాన్లు (7 లక్షల రూపాయలు), మొదటి సంతానికి జన్మనిస్తే.. 30 వేల యువాన్లు (3.50 లక్షలు) బోనస్గా ఇస్తామని ప్రకటించారు.
ఇది కూడా చదవండి: ‘నన్నెందుకు అమ్మేశారు?’ తల్లిదండ్రులపై కొడుకు న్యాయపోరాటం
గతంలో చైనా తీసుకు వచ్చిన వన్ చైల్డ్ పాలసీ వల్ల.. అప్పట్లో ఆ దేశ లింగ నిష్పత్తిలో గణనీయమైన మార్పులు చోటు చేసుకున్నాయి. ఫలితంగా దేశ జనాభాలో వృద్ధులు భారీగా పెరిగిపోయారు. అంతేకాక సింగిల్ చైల్డ్ పాలసీ వల్ల చాలా మంది మగపిల్లలను కనాలనే ఉద్దేశంతో.. అబార్షన్ల రేటు కూడా పెరిగింది. దాంతో చైనా 2016, జనవరి 1న సింగిల్ చైల్ట్ పాలసీకి స్వస్థి పలికింది. అంతేకాక ముగ్గురు సంతానానికి జన్మనివ్వడానికి చైనా అధికారికంగా అనుమతి తెల్పింది. దీంతో 2020 తర్వాత జనాభా లెక్కల్లో దాదాపు 12 మిలియన్ల జననాలు నమోదయ్యాయి. మరి సదరు చైనా కంపెనీ ప్రకటించిన ఈ ఆఫర్పై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.
ఇది కూడా చదవండి: చైనా మరో కృత్రిమ సృష్టి : మొన్న సూర్యుడు.. ఇప్పుడు చంద్రుడు