తెలంగాణలోనే ముగ్గురివి వేరు వేరు ప్రాంతాలు. కానీ ఉద్యోగాల నిమిత్తం హైదరాబాద్ లో ఓ చోట కలుసుకున్నారు. కలిసి చుదువుకున్నారు. ఈ క్రమంలోనే వారంత స్నేహితులుగా మారి వేరు వేరు ఉద్యోగాలు చేస్తున్నారు. కట్ చేస్తే అనుకోని ప్రమాదానికి గురై ముగ్గురు ప్రాణాలు కోల్పోయారు. తాజాగా ఘట్ కేసర్ లో వెలుగు చూసిన ఈ ఘటన స్థానికంగా తీవ్ర విషాదంగా మారింది. ఇక పూర్తి వివరాల్లోకి వెళ్తే.. జనగామ జిల్లా దేవరుప్పల మండలం సింగరాజుపల్లికి చెందిన పాలడుగు నవీన్ (25), జనగామ జిల్లా లింగాల ఘన్పూర్ మండలం కొత్తపల్లికి చెందిన దాసరి నవీన్ (23), జగిత్యాల జిల్లా మెట్పల్లి మండలం మెట్లచిత్తాపూర్ గ్రామానికి చెందిన నానాడం వినిత (21).
ఇది కూడ చదవండి: విషాదం.. ఒకే రోజు పుట్టి.. ఒకే రోజు చనిపోయిన అన్నదమ్ములు!
వీరంత హైదరాబాద్ లో పరిచయమై పంజగుట్టలో ప్రైవేటు ఉద్యోగాలు చేస్తున్నారు. ఇద్దరు స్నేహితు లు ఒకే గదిలో ఉంటుండగా వినీత మాత్రం ఆబిడ్స్లోని ఓ వసతి గృహంలో ఉంటోంది. ఈ క్రమంలోనే గురువారం ఉదయం నవీన్, దాసరి నవీన్, వినిత బైక్పై బీబీనగర్ వైపు నుంచి ఉప్పల్ వైపు వెళుతూ అవుషాపూర్ వద్ద పెట్రోల్ పోయించుకొని సర్వీస్ రోడ్డు నుంచి మెయిన్ రోడ్డు ఎక్కుతున్నారు. ఈ క్రమంలోనే వీరు ప్రయాణిస్తున్న బైక్ను గుర్తు తెలియని వాహనం ఢీకొట్టింది. దీంతో ముగ్గురు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. మృతుల కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చూసుకున్న పోలీసులు విచారణ చేపడుతున్నారు. ఈ ఘటనపై మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియజేయండి.