ఇంటికి కొత్త కోడలు వచ్చిందని అత్తింటి వాళ్లు అంతా తెగ సంబరపడిపోయారు. ఏకంగా నెత్తిన ఎక్కించుకుని కావాల్సినవన్నీ వండిపెడుతున్నారు. దీంతో ఆ కోడలు కూడా అందరినీ నమ్మించింది. ఇక పెళ్లై కొన్ని రోజుల కూడా కాకుండానే కోడలు భర్తతో పాటు అత్తింటివాళ్లకు పంగనామాలు పెట్టి ఊహించని సర్ ప్రైజ్ ఇచ్చింది. అసలేం జరిగిందనే పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం. బీహర్ లోని ముంగేర్ గ్రామ పరిధిలోని ఉంటే వివేక్ పొద్దార్ అనే యువకుడికి , మోనా అనే అమ్మాయికి జూన్ 14 న వైభవంగా పెళ్లి జరిగింది. జూన్ 16 న రిసెప్షన్ కూడా జరిగింది.
18న పుట్టింటికి వెళ్లి 21న అత్తగారింటికి వచ్చింది. దీంతో కొత్త కోడలు అని అత్తింటివాళ్లు కోరిన వంటకాలు వండి పెట్టారు. దీంతో అడిగిందల్లా కాదనకుండా ఇస్తూ సకల మర్యాదలు చేశారు. అయితే ఈ క్రమంలోనే భర్తతో పాటు సరదాగా మార్కెట్ వెళ్దామని చెప్పి అందంగా ముస్తాబైంది. నగలు పెట్టుకుంది. దీంతో వివేక్ కూడా తన భార్య మాట కాదనలేక సరే అన్నాడు. భార్య భర్త చేయి పట్టుకుని మార్కెట్ లో అటు ఇటు తిరిగింది.
ఇది కూడా చదవండి: Medchal District: ముగ్గురూ స్నేహితులే.. యువతి వారిని నమ్మి బైక్ ఎక్కింది!
అలా జనాల్లో నడుస్తున్న క్రమంలో భార్య మెల్లగా భర్త చేయి వదిలి పక్కకు జరిగింది. దీంతో మెల్లగా భర్త వెనక్కి తిరిగే చూసే సరికి భార్య ఓ కారులో మరో వ్యక్తితో ఎక్కుతుండగా భర్త చూశాడు. ఏంటని దిగులుగా ప్రశ్నించగా.. నన్ను నువ్వు మరిచిపోవాలని, నా గురించి వెతకొద్దు అంటూ తెలిపింది. దీంతో భర్త ఒక్కసారిగా షాక్ గురయ్యాడు. మోసపోయానని గ్రహించిన భర్త స్థానిక పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఇక కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ చేపడుతున్నారు. తాజాగా వెలుగు చూసిన ఈ ఘటన స్థానికంగా తీవ్ర చర్చనీయాంగా మారింది.