తెలుగు బుల్లితెర ప్రేక్షకులను ఆకట్టుకునే అనేక కామెడీ షోల్లో 'శ్రీదేవి డ్రామా కంపెనీ' ఒకటి. జబర్దస్త్ వంటి కామెడీ షో కు పోటీగా ఫుల్ ఎంటర్ టైన్ చేస్తుంది. ప్రతి ఆదివారం ఛానల్ ప్రసారమైయే శ్రీదేవి డ్రామా కంపెనీ ప్రేక్షకుల నుంచి మంచి మార్కులు కొట్టేసింది. ప్రతి వారం కొత్త కొత్త కాన్సెప్ట్ లతో వచ్చి ఆడియన్స్ అలరిస్తోంది. ఈ షో. తాజాగా 'పెళ్ళాం చెపితే వినాలి' అనే కాన్సెప్ట్ తో రానుంది. దీనికి సంబంధించిన ప్రోమోను మేకర్స్ విడుదల చేశారు. అయితే ఇందులో జబర్దస్త్ ఫేమ్ నూకరాజు తన భార్య కాళ్లు పట్టుకుని ఎమోషనల్ అయ్యాడు. దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం నెట్టింట్లో వైరల్ అవుతోంది. గతంలో సుడిగాలి సుధీర్ హోస్ట్ గా వ్యవహరిస్తున్న శ్రీదేవి డ్రామ కంపెనీ కామెడీ షో కి ప్రస్తుతం రష్మీ యాంకర్ వ్యవహరిస్తుంది. దాదాపు జబర్దస్త్ నటులే ఇందు లోనూ యాక్ట్ చేస్తున్నారు. పైగా ఇందులో కామెడీతో పాటు ఇతర అన్ని రకాల ట్యాలెంట్ లను ఆవిష్కరిస్తున్నారు. ఒకప్పటి హీరోయిన్ ఇంద్రజ జడ్జిగా చేస్తోంది. అలాగే సినిమా స్టార్లు కూడా ఈ షోలో మెరుస్తూ ప్రేక్షకులను అలరిస్తున్నారు. ప్రతి వారం ఓ వెరైటీ కాన్సెప్ట్ ఈ షో ప్రేక్షకుల ముందుకు వచ్చి ఆకట్టుకుంటుంది. గతంలో సీనియర్ నటీనటులను తీసుకొచ్చి వారితో అదిరిపోయే కామెడీ చేయించారు. తాజాగా 'పెళ్ళాం చెపితే వినాలి' కాన్సెప్ట్ తో వచ్చారు. ఇందులో అందరు తమ భార్యలతో వచ్చి అలరించారు. ఈ క్రమంలో జబర్దస్త్ ఫేమ్ నూకరాజు సైతం తన భార్య తో కనిపించాడు. ఈ క్రమంలో నూకరాజు మాట్లాడుతూ "నేను నీకు ఏం చేశానో.. ఏం చేయలేదో చెప్పలేను కానీ.." అంటూ ఆమె కాళ్ల పట్టుకున్నాడు. కాసేపు ఇద్దరు ఎమోషనలయ్యారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. దీనిపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.