తెలుగు సినిమాలకు గత 20 ఏళ్లుగా అవార్డులు అందిస్తున్న సంతోషం వారపత్రిక ఆధ్వర్యంలో ఈ నెల 14న హైద్రాబాద్ లో గ్రాండ్ గా జరగబోయే 20 వ సంతోషం – సుమన్ టివి సౌత్ ఇండియన్ ఫిలిం అవార్డ్స్ వేడుకల ప్రమోషన్స్ అప్పుడే మొదలయ్యాయి. ఈ ప్రమోషన్ లో భాగంగా ఇప్పటికే ఔట్ డోర్ డిజిటల్ ప్రమోషన్ ని ఓ రేంజ్ లో ప్లాన్ చేసారు. ఇప్పటికే తెలుగు రాష్ట్రాల్లో హైదరాబాద్ తో పాటు పలు పట్టణాలు, నగరాల్లో సంతోషం – సుమన్ టివి సౌత్ ఇండియా ఫిలిం అవార్డు వేడుకల యాడ్స్, ఈవెంట్ డీటెయిల్స్ తో అందిస్తున్న ప్రమోషన్స్ కు అనూహ్యమైన స్పందన వస్తోంది.
సౌత్ ఇండియాలో గ్రాండ్ గా జారబోయే 20వ సంతోషం – సుమన్ టివి సౌత్ ఇండియా ఫిలిం అవార్డు వేడుకలు ఈ నెల 14న హైద్రాబాద్ లోని ఎచ్ ఐ సిసి .. నోవాటెల్ హోటల్ లో మధ్యాహ్నం మూడు గంటల నుంచి అంగరంగ వైభవంగా జరగనున్నాయి. సౌత్ ఇండియా లోని నాలుగు బాషల సినిమాలకు అవార్డులు అందనున్నాయి. సంతోషం అధినేత సురేష్ కొండేటి ఈ అవార్డు వేడుకలను ప్రతి ఏడాది ఓ యజ్ఞం లా జరుపుతున్నారు. కరోనా సమయంలో గత రెండేళ్లు తప్ప మిగతా ప్రతి ఏడాది ఈ అవార్డులు అందచేస్తున్నారు. ఈ వేడుకల్లో డిజిటిల్ మీడియా జైన్ట్ “సుమన్ టీవీ” కూడా కావడంతో.. సంతోషం – సుమన్ టివి సౌత్ ఇండియా ఫిలిం అవార్డు వేడుక అంగరంగ వైభవంగా జరగనుంది.
ఈ వేడుకలకు తెలుగు,తమిళ, కన్నడ, మలయాళ, హిందీ భాషలకు సంబందించిన పలువురు స్టార్స్, టెక్నీషియన్స్ పాల్గొననున్నారు. ప్రముఖ గాయకుడు ఎస్పీ బాలు మృతి భారతీయ సినిమా పరిశ్రమకు తీరని లోటు. ఆయన జ్ఞాపకార్ధంగా ఎస్పీ బాలు పేరుతో అవార్డులు ఇవ్వడమే కాకుండా 100 పాటలు, వంద గలాలతో ఆయనకు స్వర నీరాజనం సమర్పించే మహత్తర కార్యక్రమం కూడా జరగబోతుండటం విశేషం.