Kiran Abbavaram: టాలీవుడ్ వైవిధ్యమైన కథాంశాలతో సినిమాలు చేస్తున్న యంగ్ హీరోలలో కిరణ్ అబ్బవరం ఒకరు. డిఫరెంట్ స్టోరీ సెలక్షన్ తో ప్రేక్షకులను అలరించడానికి ట్రై చేస్తున్నాడు. తాజాగా ‘సమ్మతమే’ మూవీతో జూన్ 24న ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. ఇప్పటికే బజ్ క్రియేట్ చేసిన ఈ రొమాంటిక్ సినిమాకు గోపీనాథ్ రెడ్డి దర్శకత్వం వహించారు. ఈ సినిమాలో కిరణ్ సరసన 'కలర్ ఫోటో' ఫేమ్ చాందినీ చౌదరి హీరోయిన్ గా నటించింది. ఇక సినిమా రిలీజ్ దగ్గర పడుతుండటంతో కిరణ్, చిత్రబృందంతో పాటు ప్రమోషన్స్ లో బిజీగా ఉన్నాడు. ఈ క్రమంలో కిరణ్ అబ్బవరంకి సంబంధించి ఓ క్రేజీ న్యూస్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. అదేంటంటే.. సాధారణంగా ఏ హీరో అయినా అభిమానులకు టికెట్ కొనుక్కొని థియేటర్లో సినిమా చూడమని చెబుతుంటారు. కానీ.. ఎవరూ కూడా ఫ్యాన్స్ అడగ్గానే టికెట్ డబ్బులు ఫోన్ పే చేయరు. ఈ విషయంలో కిరణ్ కంచెలు తెంచేసినట్లు తెలుస్తుంది. ఎందుకంటే.. తాజాగా ట్విట్టర్ లో కిరణ్.. సమ్మతమే సినిమా బుకింగ్స్ ఓపెన్ అయ్యాయని పోస్ట్ పెట్టాడు. అంతే.. ఓ అభిమాని.. 'అన్న ఒక 200 ఈ నెంబర్ కి ఫోన్ పే చేయు.. టికెట్ బుక్ చేసుకుంటా' అని రీట్వీట్ చేశాడు. వెంటనే స్పందించిన కిరణ్.. అభిమానికి రెండు వందలు పంపి.. 'పంపించాను చూడు తమ్ముడు.. ఎంజాయ్ చెయ్' అని రిప్లై ఇచ్చాడు. ఇక కిరణ్ రిప్లైకి సర్ప్రైజ్ అయిన అభిమాని.. 'థాంక్స్ అన్న నమ్మలేకపోతున్నా.' అని తన ఆనందాన్ని వ్యక్తం చేశాడు. ఇక ఈ వ్యవహారాన్ని గమనించిన నెటిజన్లు.. కిరణ్ చాలా మంచివాడు. పవన్ కళ్యాణ్ లాగే దానగుణం కలవాడని పొగుడుతుండగా.. ఇంకొందరు తెలివిగా.. అన్న మాకు కూడా 500, 600 పంపండి అంటూ కామెంట్స్ చేస్తున్నారు. చివరికి ఈ గోల భరించలేక.. 'నేనేమైనా తప్పు చేశానా తమ్ముడు' అని ట్వీట్ పెట్టాడు కిరణ్. ప్రస్తుతం కిరణ్ ట్వీట్స్ నెట్టింట వైరల్ అవుతున్నాయి. మరి కిరణ్ అబ్బవరం ఫ్యాన్ కి డబ్బులు పంపడంపై మీ అభిప్రాయాలను కామెంట్స్ లో తెలియజేయండి. Thanks Anna .money vatchindi .nammalekapothuna miru reply ivvadam — ICON Das (@ICONDas2) June 23, 2022