జమ్ముకశ్మీర్, “పుల్వామా”లో జరిగిన ఉగ్రదాడితో దేశం మొత్తం ఒక్కసారిగా ఉలిక్కిపడింది. ఉగ్రవాదులను పెంచి పోసిస్తున్న పాకిస్తాన్ కి బుద్ది చెప్పాలని దేశం మొత్తం ముక్త కంఠంతో కోరుకుంటుంది.. ప్రదాని మోది సైతం ఈసారి వెనక్కి తగ్గేది లేదని చెప్పేశాడు.. ఇందులో బాగంగానే ఈ ఘటనకు పాల్పడిన ఉగ్ర సంస్థకు ఎలా బుద్ది చెప్పాలి.. తదుపరి చర్యలు ఏంటి ? అని చర్చించడానికి మోధి ప్రభుత్వం అఖిలపక్ష సమావేశానికి పిలుపునిచ్చింది.
ఈ సమావేశం రేపు జరగనుంది. గురువారం జరిగిన ఆత్మాహుతి దాడిలో సుమారు 49 మంది సీఆర్పీఎఫ్ జవాన్లు అమరులయ్యారు. అనేక మంది గాయాలపాలయ్యారు. ప్రధాని నరేంద్ర మోదీ నేతృత్వంలో NDA ప్రభుత్వం మొదటిసారి ఇలాంటి సమావేశానికి పిలుపునిచ్చింది. దేశరక్షణ విషయంలో కాంగ్రెస్ ఎప్పుడు సపోర్ట్ గానే ఉంటుంది అని కాంగ్రెస్ అంధ్యక్షుడు రాహుల్ గాంధీ ఇప్పటికే ప్రకటించాడు.. అందువల్ల ఈ సమావేశం ఏక పక్షంగానే ఉంటుందని స్పష్టం అవుతుంది.