కర్ణాటక రాష్ట్రంలోని చిత్రదుర్గ జిల్లాలో “రామజోగి హళ్లి”లో విషాదం చోటుచేసుకుంది. రెప్పపాటులో ఇంటి పైకప్పు కూలిన ఘటనలో ఒకే కుటుంబానికి చెందిన 4 మృతిచెందారు. మరో ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి. మృతుల్లో ముగ్గురు ఐదేళ్లలోపు చిన్నారులు ఉండడం ప్రతి ఒక్కరిని కంటతడి పెట్టిస్తుంది.
ఆ చిన్నారుల తల్లి “నాగరత్నమ్మ” కూడా ఈ ఘటనలో ప్రాణాలు కోల్పోయింది. ఇలా ఒకే కుటుంబానికి చెందిన నలుగురు వ్యక్తులు చనిపోవడంతో గ్రామంలో విషాద ఛాయలు అలముకున్నాయి. ఇక ఈ ఘటనలో గాయపడ్డ మరో ఇద్దరు క్షతగాత్రులను స్థానిక ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.