
ప్రస్తుతం కరోనా వైరస్ కారణంగా యావత్ ప్రపంచం అతలాకుతలం అవుతోన్న సంగతి తెలిసిందే. ఇప్పటికే చాలా మంది ఈ కరోనా వైరస్ బారిన పడి మృతి చెందారు. అయితే ఈ వైరస్ సోకిన వారు దాని ప్రభావం కంటే కూడా భయంతోనే ఎక్కువగా మృతిచెందుతున్నట్లు వైద్యులు తెలిపారు. కరోనా వచ్చిన తరువాత తమ పరిస్థితి ఎలా ఉండబోతుందా అనే భయంతోనే సగం జనం మరణిస్తున్నట్లు పలు సర్వేలు కూడా తెలిపాయి. అయితే ఇలాంటి వారికి జపాన్లో ఓ వినూత్నమైన చికిత్సను అందిస్తున్నారు.
కరోనా బారిన పడ్డవారి భయాన్ని పోగొట్టేందుకు జపాన్లోని ఓ సంస్థ ఏర్పాటు చేసిన ‘స్కేర్ స్క్వాడ్’ అనే షో ప్రస్తుతం బాగా పాపులర్ అయ్యింది. ఈ షోలో మనుష్యులను ఒక శవపేటికలో పడుకోబెడతారు. అందులో వారికి అతి భయంకరమైన అరుపులు వినిపస్తుంటాయి. దెయ్యాల వేషంతో విండో తీసి మరీ భయపెట్టేందుకు ప్రయత్నం చేస్తారు. అయితే ఈ విధంగా వారిని భయపెడితే, వారు కరోనా వైరస్ గురించిన భయాన్ని ఏమాత్రం పట్టించుకోరని ఆ షో నిర్వాహకులు చెబుతున్నారు.
ఏదేమైనా కరోనా వైరస్ కంటే కూడా ఆ వైరస్ బారిన పడితే పరిస్థితి ఏమిటనే భయంతోనే చాలా మంది ప్రాణాలు వదులుతున్నారు. ఇలాంటి వారికోసమే ఈ షో నిర్వహిస్తున్నారు జపాన్లోని నిర్వాహకులు. కాగా ఈ షోలో పాల్గొనాలంటే ఒక్కొక్కరు 8 అమెరికన్ డాలర్లు చెల్లించాల్సి ఉంటుంది. అంటే మన కరెన్సీలో సుమారు ఆరు వందల రూపాయలు. మనదగ్గర కూడా ఇలాంటి వినూత్న కార్యక్రమం చేపడితే బాగుంటుందని పలువురు కామెంట్ చేస్తున్నారు.