డయాబెటిస్ లేదా షుగర్ ఈ పదం ఎందరో జీవితాల్లో సంతోషాన్ని హరిస్తోంది.

ప్రపంచంలో కెల్లా భారత్ లోనే ఎక్కువ టైప్-2 డయాబెటిస్ బాధితులు ఉన్నారనే లెక్కలు కలవరపెడుతున్నాయి.

2040 నాటిని భారత్ లో టైప్-2 డయాబెటిక్స్ బాధితుల సంఖ్య 140 మిలియన్లకు చేరుతుంది అంటున్నారు.

కేవలం తీపి పదార్థాలు తినడం వల్లే షుగర్ లెవల్స్ పెరుగుతాయి అనుకోవడం అపోహ మాత్రమే.

అత్యధిక కొవ్వు కలిగి ఉన్న పదార్థాల్లోనూ తీపి ఎక్కువగా ఉన్నట్లు సైంటిస్టులు కనుగొన్నారు.

ఫ్యాట్, తీపి ఎక్కువగా ఉండే ఆహారం వల్ల బరువు ఎక్కవగా పెరుగుతారు. అలా జరిగితే శరీరంలోని బ్లడ్ షుగర్ లెవల్స్ పెరిగి మధుమేహానిక దారి తీస్తుంది.

డయాబెటీస్ తో బాధపడేవారు కార్బోహైడ్రేట్లు ఉండే ఆహారం తీసుకోకూడదని పూర్తిగా దూరం పెట్టేస్తారు.

అయితే అలా చేయకుండా వాటిని మరో మార్గంలో తీసుకుంటే ఎంతో మేలు చేస్తాయి.

కార్బోహైడ్రేట్లను ప్రోటీన్లతో కలిపి తీసుకుంటే గ్లూకోజ్ మరింత నెమ్మదిగా విడుదల చేస్తాయి.

డయాబెటిస్ ను అదుపులో ఉంచాలంటే ఆరోగ్యకర ప్రొటీన్లు తీసుకోవడం కూడా ముఖ్యమే.

ఫ్యాట్ తక్కువగా, ప్రోటీన్లు అధికంగా ఉండే ఆహారాన్ని తీసుకోవడం మంచిది.

ఒత్తిడి కూడా రక్తంలో చక్కెరస్థాయి పెంచుతుంది.

అందుకే సాధ్యమైనంత ప్రశాంతంగా ఉండాలి.

అంతే కాకుండా షుగర్ లెవల్స్ ఎప్పుడూ అదుపులో ఉండాలంటే తప్పకుండా వ్యాయామం చేయాలి.