ఈ ‘జై భీమ్’ సినిమా ఇప్పుడు దేశవ్యాప్తంగా పెద్ద హాట్ టాపిక్ గా మారింది. “రాజకన్ను, పార్వతి అనే దంపతులను జీవితాన్ని ఆధారంగా చేసుకుని దర్శకుడు టీజే. జ్ఞానవేల్ తెరకెక్కించిన ఈ చిత్రం ఆనాటి పరిస్థితులకి అద్దం పట్టేలా ఉండటం విశేషం.
రియల్ లైఫ్ లో లాయర్ చంద్రును చూసి ప్రేక్షకులు ఎలా గర్వపడుతున్నారో రియల్ సినతల్లి పార్వతిపై అంతే జాలి చూపిస్తున్నారు.
ఈ నేపధ్యలోనే రాఘవ లారెన్స్ పార్వతికి సాయం చేయడానికి ముందుకొచ్చాడు. ఆమెకు సొంత ఇళ్లు కట్టిస్తానని మాటిచ్చాడు.
అయితే.., ఇదే సమయంలో నెటిజన్స్ మరో అనుమానాన్ని వ్యక్తం చేస్తున్నారు.
“జై భీమ్” సినిమా చివరిలో సినతల్లికి జరిగిన అన్యాయాన్ని కోర్టు గుర్తిస్తుంది. ఆమెకి అనుకూలంగా తీర్పు ఇస్తుంది.
ఆ తీర్పులో సినతల్లికి ఊరి మధ్యలో రెండు ఎకరాల పొలము రిజిస్టర్ చేపించి, ఇల్లు కట్టియ్యాలని అధికారులను ధర్మాసనం ఆదేశించింది.
“జై భీమ్” సినిమాని పార్వతి రియల్ లైఫ్ నుండే తీసుకున్నారు కాబట్టి.. ఆమెకి అధికారులు ఆ ఇల్లు కట్టించి ఇచ్చినట్టే అర్ధం అవుతుంది.
“జై భీమ్” సినిమాని పార్వతి రియల్ లైఫ్ నుండే తీసుకున్నారు కాబట్టి.. ఆమెకి అధికారులు ఆ ఇల్లు కట్టించి ఇచ్చినట్టే అర్ధం అవుతుంది.
“జై భీమ్” ఆల్ ఓవర్ ఇండియాలో సూపర్ సక్సెస్ అయ్యాక..దర్శకుడు జ్ఞానవేల్ ఆ చిత్ర రియల్ క్యారెక్టర్స్ అందరిని ప్రజలకి పరిచయం చేశాడు.
తాను ఇప్పటికీ ఆర్ధిక కష్టాలను అనుభవిస్తున్నట్టు చెప్పుకొచ్చింది. ఈ విషయం తెలిసే రాఘవ లారెన్స్ ఆమెకి ఇల్లు కట్టించడానికి ముందుకి వచ్చాడు.
పార్వతి ఆర్ధిక సమస్యలు తీర్చడానికి లారెన్స్ నగదు రూపంలో కూడా సహాయం చేయవచ్చు. కానీ.., ప్రత్యేకంగా ఇంటినే ఎందుకు కట్టిస్తానని అన్నట్టు?
పార్వతికి ఎదురైన ఆర్ధిక కష్టాలు ఆమెని ఆ ఇల్లు అమ్మకునేలా చేశాయా? అసలు ఇప్పుడు పార్వతికి ఇచ్చిన 2 ఎకరాల పొలం ఏమైంది? ఆమె కూతురు ఎలాంటి పొజిషన్ లో ఉన్నారు?
అన్న ప్రశ్నలకి సమాధానం తెలుసుకోవడానికి నెటిజన్స్ తెగ ఆసక్తి చూపిస్తున్నారు. పార్వతి పరిస్థితి ఏదైనా.. ఆమె కష్టాల్లో ఉందని అర్ధం చేసుకుని,
సహాయం చేయడానికి ముందుకి వచ్చిన లారెన్స్ పై మాత్రం అభినందనల వర్షం కురుస్తోంది. కానీ.. సినతల్లికి కోర్టు కట్టించి ఇచ్చిన ఇల్లు ఏమైందన్న విషయమే ఇప్పుడు మిస్టరీగా మారింది.
మరి.. ఈ విషయంలో మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.