‘ఐసీసీ టీ20 వరల్డ్ కప్’ భారత్- పాకిస్తాన్ మ్యాచ్ తర్వాత సోషల్ మీడియా వేదికగా ఎన్నో భిన్న పరిణామాలు తలెత్తాయి.

ముఖ్యంగా భారత్- పాక్ మాజీల మధ్య కొన్ని మాటల యుద్ధాలు జరిగాయి.

వాటిలో టీమిండియా స్టార్ స్పిన్నర్ హర్భజన్ సింగ్- పాక్ మాజీ పేసర్ మహ్మద్ అమిర్ మాటల యుద్ధం ఇంకా కొనసాగుతోంది.

పాక్ గెలిచిన తర్వాత అమిర్.. హర్భజన్ సింగ్ ను ట్యాగ్ చేస్తూ వ్యంగ్యంగా ఒక ట్వీట్ చేశాడు.

అందుకు భజ్జీ ‘ఇప్పుడే నువ్వే చెప్పాలి ఈ సిక్స్ మీ ఇంట్లో టీవీపై ల్యాండ్ అయ్యిందా? నువ్వు చెప్పినట్టు ఎండ్ అఫ్ ది డే ఇట్స్ ఏ క్రికెట్’ అంటూ వీడియో షేర్ చేశాడు.

భజ్జీ ట్వీట్ కు మళ్లీ అమిర్ రిప్లై ఇచ్చాడు. హర్భజన్ బౌలింగ్ లో అఫ్రీది వరుస సిక్సర్లు కొట్టిన వీడియో అది.

అందుకు హర్భజన్.. అమిర్ కు గట్టిగానే రిప్లై ఇచ్చాడు. 2010లో ఇంగ్లాండ్- పాక్ మధ్య జరిగిన మ్యాచ్ లో అమిర్ నోబాల్ వేసిన ఇమేజ్ ను ట్వీట్ చేశాడు.

అందులో ‘నీలాంటి వారికి కేవలం డబ్బే ముఖ్యం. పరువు, గౌరవంతో సబంధం లేదు కేవలం నీకు డబ్బే కావాలి. నీ చర్యలతో జనాలను పిచ్చివాళ్లను చేయాలనుకోకు.’ అంటూ భజ్జీ కౌంటర్ ఇచ్చాడు.

ఫిక్సర్ కో సిక్సర్ అంటూ హర్భజన్ సింగ్ సిక్స్ కొట్టిన వీడియో మళ్లీ పోస్ట్ చేశాడు. 

2010లో ఇంగ్లండ్తో జరిగిన సిరీస్లో మహ్మద్ అమిర్తోపాటు మహ్మద్ అసిఫ్, సల్మాన్ భట్ స్పాట్ ఫిక్సింగ్కు పాల్పడినట్లు దర్యాప్తులో తేలింది.

అందుకు అమిర్పై పాకిస్తాన్ క్రికెట్ బోర్డు అప్పుడు వేటు వేసింది. 

2016లో అతనిపై నిషేధాన్ని తొలగించింది అంతర్జాతీయ క్రికెట్ అడేందుకు అవకాశం ఇచ్చింది. గతేడాది మహ్మద్ అమిర్ రిటైర్మెంట్ ప్రకటించాడు.