ఏటా ఏప్రిల్, మే నెలలో వేసవి కాలపు ఎండలు ప్రారంభమవుతుంతాయి.

అయితే ఈ ఏడాది మార్చి తొలివారంలోనే మండే ఎండలు వచ్చిపడ్డాయి.

అంతేకాక రానున్న రోజులలో సూర్యతాపం ఎలా ఉండబోతుందో ముందుగానే హెచ్చరిస్తున్నాయి.

మండే ఎండల నుంచి  జాగ్రత్తగా ఉంటేనే మన శరీరం ఆరోగ్యవంతంగా ఉండగలుగుతుంది.

ముఖ్యంగా వేడి, డీహైడ్రేషన్ వంటి సమస్యల బారిన పడకుండా శరీరాన్ని మనం కాపాడుకోవాలి.

వేసవిలో కొన్ని రకాల పానీయాలతో ఆరోగ్యాన్ని కాపాడుకోవచ్చని నిపుణులు సూచిస్తున్నారు.

చెరుకు రసం మనల్ని వేసవి తాపం నుంచి కాపాడుతుంది.

చెరకు, అల్లం, నిమ్మకాయలను కలిపి జ్యూస్ ను  ఐస్ లేకుండా తాగడం మంచింది.

వేసవి కాలంలో మజ్జిగ పానీయంగా లేదా ఆహారంగా తీసుకోవడం ఆరోగ్యాని చాలా మంచిది.

భోజనం చేసిన తర్వాత ఒక గ్లాసు మజ్జిగ తాగడం వల్ల శరీరానికి మేలు జరుగుతుంది.

 పుచ్చకాయ రసం మన దాహం తీర్చడమే కాకుండా శరీరానికి కావలసిన పోషకాలను అందిస్తుంది.

మెంతి టీ మన శరీరానికి చాలా చల్లదనాన్ని ఇవ్వడమే కాక వ్యర్థాలను బయటకు పంపుతుంది.

ఆహారంలో ఉపయోగించే జీలకర్ర మన అంతర్గత ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది.

జీలకర్ర నీరు మన శరీరానికి చాలా చల్లదనాన్ని ఇవ్వడంతో పాటు జీర్ణ సమస్యలను పరిష్కరిస్తుంది.

ఎండకాలంలో తప్పనిసరిగా తీసుకోవలసిన డ్రింక్ ఏమైనా ఉంది అంటే అది కొబ్బరి నీరే.

వేసవి కాలంలో కొబ్బరినీళ్లు తాగడం వల్ల శరీరం రోజంతా చల్లగా ఉంటుంది.

వేసవి కాలంలో కొబ్బరినీరు తాగితే శరీరానికి శక్తి లభించి.. ఉల్లాసంగా ఉంటాము.